2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు తాజాగా మరో బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. అంచనాల మేరకే కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్నది స్పష్టమైంది.
అయితే ఆయన అమరావతి రాజధాని నినాదంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తికర అంశంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. దానికి బిల్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఇటీవల దాన్ని వెనక్కి తీసుకున్నారు. మరిన్ని మార్పులతో బిల్లును సరికొత్తగా తీసుకొస్తామని ప్రకటించారు. మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నినాదంగా ఎన్నికలకు వెళ్తానని రఘురామ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దాని వెనక అసలు కారణం ఏమిటన్నది ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
బీజేపీకి నరసాపురంలో మంచి బలమే ఉంది. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు ఆ పార్టీ తరపున గెలిచారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు. అయితే కేవలం బీజేపీని మాత్రమే నమ్ముకుని పోతే ప్రయోజం ఏ మేరకు ఉంటుందనే విషయం ఆయనకు తెలియంది కాదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అక్కడ వైసీపీని ఎదుర్కొని గెలవాలంటే అమరావతి నినాదాన్ని తీసుకు వచ్చి.. దానికి మద్దతిచ్చే పార్టీల సహకారం పొందాలని రఘురామ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన మద్దతు కీలకమని ఆయన అనుకుంటున్నారని సమాచారం. అందుకే అమరావతి నినాదంతో బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తే టీడీపీ, జనసేన మద్దతు కూడా తనకు లభిస్తుందని ఆయన భావించి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on January 8, 2022 9:30 pm
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…