2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు తాజాగా మరో బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. అంచనాల మేరకే కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్నది స్పష్టమైంది.
అయితే ఆయన అమరావతి రాజధాని నినాదంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తికర అంశంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. దానికి బిల్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఇటీవల దాన్ని వెనక్కి తీసుకున్నారు. మరిన్ని మార్పులతో బిల్లును సరికొత్తగా తీసుకొస్తామని ప్రకటించారు. మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నినాదంగా ఎన్నికలకు వెళ్తానని రఘురామ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దాని వెనక అసలు కారణం ఏమిటన్నది ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
బీజేపీకి నరసాపురంలో మంచి బలమే ఉంది. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు ఆ పార్టీ తరపున గెలిచారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు. అయితే కేవలం బీజేపీని మాత్రమే నమ్ముకుని పోతే ప్రయోజం ఏ మేరకు ఉంటుందనే విషయం ఆయనకు తెలియంది కాదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అక్కడ వైసీపీని ఎదుర్కొని గెలవాలంటే అమరావతి నినాదాన్ని తీసుకు వచ్చి.. దానికి మద్దతిచ్చే పార్టీల సహకారం పొందాలని రఘురామ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన మద్దతు కీలకమని ఆయన అనుకుంటున్నారని సమాచారం. అందుకే అమరావతి నినాదంతో బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తే టీడీపీ, జనసేన మద్దతు కూడా తనకు లభిస్తుందని ఆయన భావించి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on January 8, 2022 9:30 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…
ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు.…
ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ…
ఐ బొమ్మ రవి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఫాలో అయ్యే వాళ్లందరికీ ఈ పేరు పరిచయమే.…