Political News

అందుకేనా అమ‌రావ‌తి నినాదం!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణంరాజు తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ఆయ‌న ఇప్పుడు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అంత‌కంటే ముందే తానే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు బీజేపీ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. అంచ‌నాల మేర‌కే కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.

అయితే ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధాని నినాదంతో ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నారు. దానికి బిల్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఇటీవ‌ల దాన్ని వెన‌క్కి తీసుకున్నారు. మ‌రిన్ని మార్పుల‌తో బిల్లును స‌రికొత్త‌గా తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం రైతులు ఉద్య‌మం కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నినాదంగా ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాని వెన‌క అస‌లు కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీకి న‌ర‌సాపురంలో మంచి బ‌ల‌మే ఉంది. 2014 ఎన్నిక‌ల్లో గోక‌రాజు గంగ‌రాజు ఆ పార్టీ త‌ర‌పున గెలిచారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించారు. అయితే కేవ‌లం బీజేపీని మాత్ర‌మే న‌మ్ముకుని పోతే ప్ర‌యోజం ఏ మేర‌కు ఉంటుంద‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అందుకే అక్క‌డ వైసీపీని ఎదుర్కొని గెల‌వాలంటే అమ‌రావ‌తి నినాదాన్ని తీసుకు వ‌చ్చి.. దానికి మ‌ద్ద‌తిచ్చే పార్టీల స‌హ‌కారం పొందాల‌ని ర‌ఘురామ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు కీల‌క‌మ‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకే అమ‌రావ‌తి నినాదంతో బీజేపీ అభ్య‌ర్థిగా ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తే టీడీపీ, జ‌న‌సేన మ‌ద్దతు కూడా త‌న‌కు ల‌భిస్తుంద‌ని ఆయ‌న భావించి ఉండ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

20 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

52 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago