Political News

అందుకేనా అమ‌రావ‌తి నినాదం!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణంరాజు తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ఆయ‌న ఇప్పుడు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అంత‌కంటే ముందే తానే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు బీజేపీ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. అంచ‌నాల మేర‌కే కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.

అయితే ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధాని నినాదంతో ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నారు. దానికి బిల్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఇటీవ‌ల దాన్ని వెన‌క్కి తీసుకున్నారు. మ‌రిన్ని మార్పుల‌తో బిల్లును స‌రికొత్త‌గా తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం రైతులు ఉద్య‌మం కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నినాదంగా ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాని వెన‌క అస‌లు కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీకి న‌ర‌సాపురంలో మంచి బ‌ల‌మే ఉంది. 2014 ఎన్నిక‌ల్లో గోక‌రాజు గంగ‌రాజు ఆ పార్టీ త‌ర‌పున గెలిచారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించారు. అయితే కేవ‌లం బీజేపీని మాత్ర‌మే న‌మ్ముకుని పోతే ప్ర‌యోజం ఏ మేర‌కు ఉంటుంద‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అందుకే అక్క‌డ వైసీపీని ఎదుర్కొని గెల‌వాలంటే అమ‌రావ‌తి నినాదాన్ని తీసుకు వ‌చ్చి.. దానికి మ‌ద్ద‌తిచ్చే పార్టీల స‌హ‌కారం పొందాల‌ని ర‌ఘురామ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు కీల‌క‌మ‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకే అమ‌రావ‌తి నినాదంతో బీజేపీ అభ్య‌ర్థిగా ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తే టీడీపీ, జ‌న‌సేన మ‌ద్దతు కూడా త‌న‌కు ల‌భిస్తుంద‌ని ఆయ‌న భావించి ఉండ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on January 8, 2022 9:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

1 hour ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

2 hours ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

2 hours ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

3 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

3 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

3 hours ago