Political News

కేటీఆర్ ఏం జ‌రుగుతోంది.. నేత‌ల‌ ఆందోళ‌న‌

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై పార్టీ నేత‌లు ఆందోళ‌న‌గా ఉన్నారు. ఇటీవ‌ల సంగారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌ ప్ర‌వ‌ర్తించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. కేటీఆర్‌ వ్య‌వ‌హార శైలి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసేలా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గులాబీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.

ఇటీవ‌ల సంగారెడ్డిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని ప్రోత్స‌హించే విధంగా వ్యాఖ్య‌లు చేశారు. ఒక కార్య‌క్ర‌మంలో వేదిక పంచుకున్న జ‌గ్గారెడ్డితో కేటీఆర్ గుస‌గుస‌లాడ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్‌ను జ‌గ్గారెడ్డితో క‌లిసి ప‌ని చేయాల‌ని కేటీఆర్ కోర‌డం పార్టీ శ్రేణుల‌ను తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డేసింది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌త‌ను గుర్తించ‌కుండా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌కు ప్ర‌తిఫ‌లం ద‌క్కేలా కేటీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సంగారెడ్డిలో మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేస్తామ‌ని 2018 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కేటీఆర్ ఆ క్రెడిట్‌ను జ‌గ్గారెడ్డి ఖాతాలో వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అసెంబ్లీలో అడిగిన వెంట‌నే సంగారెడ్డిలో మెడిక‌ల్ కళాశాల‌ను ఏర్పాటు చేశార‌ని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. కేటీఆర్ వ్యాఖ్య‌లతో తాము ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అదీ కాకుండా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు త‌మ‌తో కాకుండా ప్ర‌త్య‌ర్థి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో శంకుస్థాప‌న చేయించ‌డం పార్టీ వ‌ర్గాల‌కు ఏమాత్రం రుచించ‌డం లేదు.

ఇదిలా ఉండ‌గా.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత‌టా గులాబీ పార్టీ చావు డ‌ప్పు కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. జిల్లా మొత్తం ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా సంగారెడ్డిలో మాత్రం ఎలాంటి స్పంద‌న లేద‌ట‌. కేటీఆర్ తీరుకు నొచ్చుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ దీనికి దూరంగా ఉన్నార‌ట‌. త‌న‌కు అనారోగ్యం ఉండ‌డం వ‌ల్లే దూరంగా ఉన్నాన‌ని ప్ర‌భాక‌ర్ చెబుతున్న‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం ఏదో జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌.

ఈ విష‌యంపై మంత్రి హ‌రీశ్‌రావును త్వ‌ర‌లో క‌ల‌వ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అధిష్ఠానంతో ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవాల‌ని భావిస్తున్నారా..? ఆయ‌న చేరితే పార్టీనే న‌మ్ముకున్న త‌మ ప‌రిస్థితి ఏమిటీ..? అదే జ‌రిగితే పార్టీలో కొన‌సాగే విష‌యం ఆలోచించుకోవాల్సి ఉంటుంద‌ని పార్టీ శ్రేణులు హెచ్చ‌రిస్తున్నాయ‌ట‌. మా ఎంపీ, ఎమ్మెల్యేల‌ను బాగా చూసుకోవాల‌ని కేటీఆర్ జ‌గ్గారెడ్డికి చెప్ప‌డం చూస్తే పార్టీని ఆయ‌న చేతిలో పెడుతున్నారా.. అని అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

This post was last modified on December 23, 2021 2:24 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

6 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

9 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

9 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

9 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

10 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

10 hours ago