Political News

సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేయండి

“సీఎం జ‌గ‌న్ చెప్పింది చాలా క‌రెక్ట్‌. ఆయ‌న చాలా దూర‌దృష్టితో కొన్ని సూచ‌న‌లు చేశారు. ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించేందుకు రెడీగా ఉంది. ఇలా చేయ‌మనండి. కేంద్రాన్ని ఆలోచించ‌మ‌నండి. సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌ను .. మీరు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. త‌ప్ప‌కుండా.. ఏపీకి న్యాయం జ‌రుగుతుంది” ఇలా రాసింది .. హైకోర్టు ధ‌ర్మాస‌నాన్ని కోరింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను విచారించిన సీబీఐ.. మాజీ జేడీ.. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన ల‌క్ష్మీనార‌ణే!

విశాఖ ఉక్కుక‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టుద‌లగా ఉన్న విష‌యం తెలిసిందే. అయ‌తే.. దీనిపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు.. నాయ‌కులు పోరాటం చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఒక‌రోజు దీక్ష చేశారు. అయితే.. ఎవ‌రూ న్యాయ‌పోరాటం దిశ‌గా అడుగులు వేయ‌లేదు. కానీ.. జేడీ మాత్రం దీనిని రాష్ట్ర హైకోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లారు. ఇప్ప‌టికే ఆయ‌న దీనిపై పిటిష‌న్ వేయ‌డం.. రెండు సార్లు విచార‌ణ కూడా జ‌ర‌గ‌డం తెలిసిందే. తాజాగా ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జేడీ హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి రాసిన లేఖ‌లోని అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మా పిటీషన్ పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే.. గ‌తంలో ఆదేశించిన‌ట్టు స్టీల్ ప్లాంట్ నుంచి ఎటువంటి అఫిడవిట్ దాఖలు కాలేదు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ నే తమ అఫిడవిట్ గా తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్పింది. దీంతో ఫిబ్రవరి రెండుకు విచారణ వాయిదా పడింది. అయితే.. జేడీ ల‌క్ష్మీనార‌య‌ణ త‌ర‌ఫున న్యాయ‌వాది అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. దీనిలో ఏమ‌ని పేర్కొన్నారంటే..

ప్రభుత్వ పాలసీ నిర్ణయాల వల్ల రాజ్యాంగ హక్కుల భంగం కలిగితే కోర్ట్ జోక్యం చేసుకోవచ్చు. నాడు భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు న్యాయం జరగలేదు. ప్రైవేటీకరణ తో భూములు ఇచ్చిన హక్కులకు భంగం కలుగుతుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ప్రత్యామ్నాయాలు సూచించారు. సీఎం జ‌గ‌న్ చెప్పిన విష‌యాల‌ను.. ఆయ‌న సూచించిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ అవసరం లేదు.. అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 16, 2021 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago