ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని ఆదేశించింది. దీంతో, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో నేడు ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ కు టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు ముందుగా పంపించాలని ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది.
అంతేకాకుండా, టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించారు. అంతకుముందు, జీవో నం.35 కొట్టివేత సందర్భంగా హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.
కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సినిమా టికెట్ ధరలపై తగ్గింపు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. దీంతో, పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారాన్ని థియేటర్ల యజమానులకు హైకోర్టు సింగిల్ బెంచ్ కల్పించింది. ఇక, హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా నిర్ణయంతో టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం జేసీల చేతికి వెళ్లింది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…