Movie News

సమరానికి సిద్ధమంటున్న శ్రీవిష్ణు

యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కమర్షియల్ ఫార్మాట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ శ్రీవిష్ణు రూటే వేరు. హీరోయిజం కోసం పాకులాడడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండి తీరాలనే నియమాలేమీ పెట్టుకోడు.

కామెడీ, రొమాన్స్ కచ్చితంగా కావాలనుకోడు. దీనివల్ల అతను టాప్ హీరో కాలేకపోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తాడనే పేరైతే తెచ్చుకున్నాడు. ఈ నెలాఖరుకి మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీవిష్ణు హీరోగా తేజ మార్ని డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అర్జున ఫల్గుణ’ మూవీని డిసెంబర్‌‌ 31న న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అర్జునుడు సమరానికి సిద్ధమయ్యాడు, చూడటానికి రెడీ అవ్వమంటున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నరేష్, శివాజీ రాజా, దేవీప్రసాద్, సుబ్బరాజు, మహేష్ తదితరులు నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. పి.సుధీర్ వర్మ డైలాగ్స్ రాశాడు. నిజానికి ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.

అది నిజం కాదని ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టైటిల్‌తో పాటు పాటలు, టీజర్‌‌ కూడా ఇంప్రెస్ చేశాయి. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడనే ఫీల్‌ని కలిగించాయి. సినిమా చూశాక కూడా అదే ఫీల్ కలిగితే శ్రీవిష్ణుకి గత చిత్రం ‘రాజ రాజ చోర’తో వచ్చిన సక్సెస్‌ కంటిన్యూ అవ్వడం ఖాయం.

This post was last modified on December 16, 2021 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago