యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కమర్షియల్ ఫార్మాట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ శ్రీవిష్ణు రూటే వేరు. హీరోయిజం కోసం పాకులాడడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండి తీరాలనే నియమాలేమీ పెట్టుకోడు.
కామెడీ, రొమాన్స్ కచ్చితంగా కావాలనుకోడు. దీనివల్ల అతను టాప్ హీరో కాలేకపోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తాడనే పేరైతే తెచ్చుకున్నాడు. ఈ నెలాఖరుకి మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీవిష్ణు హీరోగా తేజ మార్ని డైరెక్షన్లో తెరకెక్కిన ‘అర్జున ఫల్గుణ’ మూవీని డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అర్జునుడు సమరానికి సిద్ధమయ్యాడు, చూడటానికి రెడీ అవ్వమంటున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నరేష్, శివాజీ రాజా, దేవీప్రసాద్, సుబ్బరాజు, మహేష్ తదితరులు నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. పి.సుధీర్ వర్మ డైలాగ్స్ రాశాడు. నిజానికి ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.
అది నిజం కాదని ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టైటిల్తో పాటు పాటలు, టీజర్ కూడా ఇంప్రెస్ చేశాయి. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నాడనే ఫీల్ని కలిగించాయి. సినిమా చూశాక కూడా అదే ఫీల్ కలిగితే శ్రీవిష్ణుకి గత చిత్రం ‘రాజ రాజ చోర’తో వచ్చిన సక్సెస్ కంటిన్యూ అవ్వడం ఖాయం.
This post was last modified on December 16, 2021 2:45 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…