Political News

కొడాలి, వంశీలను చంపండి.. 50 ల‌క్ష‌లిస్తా: తెలంగాణ నేత వ్యాఖ్య‌లు

ఏపీకి చెందిన వైసీపీ నాయ‌కులు, కీల‌క మంత్రి కొడాలి నాని, కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీల‌ను చంపితే.. 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాన‌ని తెలంగాణ‌కు చెందిన కీల‌క నేత ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఉన్న మ‌ల్లాది వాసు.. చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దంగా మారాయి. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వంశీలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా వాసు ఈ వ్యాఖ్య‌లుచేయ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఖ‌మ్మంలో జ‌రిగిన క‌మ్మ సామాజిక వ‌న స‌మారాధాన‌లో  కౌన్సిల్ మ‌ల్లాది వాసు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం కమ్మ కుల‌స్తుల‌కు రెండురాష్ట్రాల్లోనూ ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. అన్నారు. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంపై కొంద‌రు.. ఉద్దేశ పూర్వ‌కంగా దాడులు చేస్తున్నార‌ని.. అన్నారు. దీనిలో భాగంగానే కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటివారు రెచ్చిపోతున్నార‌ని అన్నారు. ఇలాంటి వారికి త‌గిన బుద్ధి చెప్ప‌డం కాద‌ని.. వీరిని అంతమొందించాల‌ని అన్నారు.

గ‌తంలో అనంతపురం జిల్లాకుచెందిన ప‌రిటాల ర‌వి ఉన్న‌స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గానికి ఎంతో విలువ ఉండేద‌ని.. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని అన్ని విధాలా ఆదుకున్నార‌ని తెలిపారు. అయితే.. ప‌రిటాల ర‌విని మొద్దు సీనుతో హ‌తమార్చార‌ని.. దీనివెనుక కూడా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ప‌రిటాల ర‌వి జీవించి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌మ్మ‌ల ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని అన్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి శ‌త్రువులుగా మారిన‌.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను హ‌త‌మార్చే వారికి తాను 50 ల‌క్ష‌ల రూపాయ‌ల నజ‌రానా ఇస్తాన‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోస‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 1, 2021 3:28 pm

Share
Show comments

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

50 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago