Political News

శ్రీవారి సేవకు వెళుతూ డాలర్ శేషాద్రి హఠ్మాన్మరణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ (సోమవారం) తెల్లవారుజామున గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. తిరుమల నుంచి ఆయన విశాఖపట్నానికి కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావటం.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు పోయినట్లుగా చెబుతున్నారు.

నిత్యం శ్రీవారి సేవలో మునిగి డాలర్ శేషాద్రి.. తిరుమల అర్చకులన్నంతనే భక్తులకు గుర్తుకు వస్తారు. తెలుగు వారికే కాదు.. శ్రీవారి భక్తులందరికి సుపరిచితులైన ఆయన జీవితాన్ని చూస్తే.. ఎత్తుపల్లాలు బోలెడన్ని కనిపిస్తాయి. ఆయన పేరు పలు వివాదాలతో ముడిపడి ఉంటుంది. అయితే.. వీవీఐపీ భక్తులు.. ప్రముఖులు పలువురు ఆయనకు విపరీతమైన ప్రాధాన్యతను ఇస్తుంటారు.

1978లో శ్రీవారి సేవలో మునిగిన ఆయన నిర్విరామంగా 43 ఏళ్ల పాటు తిరుమలలోనే ఉన్నారు. 2007లో రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి.. శ్రేషాద్రి సేవలు టీటీడీకి అవసరమని భావించి ఆయన్ను ఓఎస్డీగా కొనసాగిస్తున్నారు.మరణానికి ముందు వరకు శ్రీవారి సేవలోనే మునిగిన ఆయన.. తుదిశ్వాస మాత్రం తిరుమల గడ్డ మీద కాకుండా విశాఖలో విడవటం గమనార్హం.

డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరని నష్టమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలకు వచ్చే ప్రముఖులు పలువురు.. ఆయన చేతుల మీదుగా తీర్థప్రసాదాలు తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.టీటీడీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఈ రోజు (సోమవారం) కార్తీక మహా దీపోత్సవాన్ని నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వేళలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈవో జవహర్ రెడ్డి.. శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి హాజరు కావాల్సి ఉంది.
ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరవుతారన్న అంచనా ఉంది. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న టీటీడీ ఈ-కౌంటర్ లో భక్తులకు పాసులు జారీ చేశారు. ఇంత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం షాకింగ్ గా మారింది. శ్రీవారి భక్తులు.. టీటీడీ వర్గాలు డాలర్ శేషాద్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

This post was last modified on November 29, 2021 8:12 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

7 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago