Political News

ట్విస్ట్ : ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సైకిల్ ప‌రుగు.. ప‌రాజ‌యం దిశ‌గా వైసీపీ

నిన్న‌టి మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలో ఒకింత ఇబ్బందిపాలైన టీడీపీకి ఇప్పుడు భారీ ఊర‌ట ల‌భిస్తోం ది. తాజాగా ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా గ‌తంలో మిగిలిపోయిన మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ స్థానాల‌కు మంగ‌ళ‌వారం ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ గురువారం ప్రారంభ‌మైంది. వీటిలో టీడీపీకి సానుకూల ప‌రిణామాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి కంచుకోట వంటి అనంత‌పురంలో 2019లో పోయిన ప్రాభ‌వం తిరిగి ల‌భిస్తోంది. ఇక్క‌డ ఎంపీటీసీ స్థానాల్లో సైకిల్ ప‌రుగులు పెడుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలంలోని పడమటి పాలెం, బట్టేలంక స్థానాలను జనసేన కైవసం చేసుకుంది.

అనంత‌పురం జిల్లా శింగనమల మండలం వెస్టు నరసాపురం ఎంపీటీసీ ఎన్నికలలో 143 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం అనంతపురం ఎంపిటిసి టిడిపి అభ్యర్థి చిలకల చిన్న గోవిందు109 ఓట్ల‌ మెజారిటీతో గెలుపొందారు. వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ఓటమి పాలయ్యారు.

నెల్లూరు జిల్లాలోన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెముడుగుంట చంద్రమౌళి 806 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురం మండలంలోని అనంతమడుగు ఎంపీటీసీ లేపాక వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ య‌న వైసీపీ అభ్య‌ర్థి.

అనంతపురం జిల్లా పరిగి మండలం శాసన కోట ఎంపీటీసీ ఎన్నికల రెండవ రౌండు ముగిసేసరికి 213 ఓట్ల మెజారిటీతో వైసిపి విజయం సాధించింది.

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జుటూరు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ పూర్తిఅయ్యేసరికి 4 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గజ్జయ్యగారి నాగిరెడ్డి గెలుపొందారు.

అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పద్మాకర్ రెడ్డి 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా.. దాదాపు టీడీపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం క‌నిపిస్తోంది.

This post was last modified on November 18, 2021 1:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

33 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

40 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago