Political News

మ‌త మార్పిడులు నిజ‌మేనా?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై కేంద్రంలోని ఎస్సీ క‌మిష‌న్ సీరియ‌స్ అయింది. రాష్ట్రంలో మ‌త మార్పిడులు జ‌రుగుతున్నాయా? లేదా? అని ప్ర‌శ్నించింది. దీనికి సంబంధించి ఎందుకు స‌మాచారం ఇవ్వ‌డం లేదు? అని నిల‌దీసింది. మీరు స‌మాధానం ఇవ్వ‌డం లేదంటే.. మ‌త మార్పుడులు జ‌రుగుతున్నాయ‌న్న పిటిష‌న‌ర్ల వాద‌న‌తో తాము ఏకీభ‌వించాల్సి ఉంటుంద‌ని.. హెచ్చ‌రించింది. ఇదే జ‌రుగుతున్న‌ట్టు భావిస్తే.. చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తామ‌ని.. నిజాల‌ను దాచ‌డం కూడా నేర‌మేన‌ని.. స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఎస్సీ క‌మిష‌న్ ఘాటు లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మత మార్పిడులపై నివేదిక ఇవ్వటంలో జాప్యం చేయటాన్ని తప్పుబట్టింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రాసిన లేఖ‌లో.. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని.. త‌మ దాకా వ‌చ్చినా.. ప‌ట్టించుకోవ‌డం లేదంటే.. రాష్ట్రంలో ఏదో జ‌రుగుతోంద‌ని తాము భావించే ప‌రిస్థితిని క‌ల్పించిన‌ట్టేన‌ని తెలిపింది. రిజ‌ర్వేష‌న్ల కోసం.. మ‌త మార్పిడులు జ‌రుగుతున్నా.. ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణంగానే ప‌రిగ‌ణిస్తామ‌ని.. దీనిపై పిటిష‌న‌ర్లు లేవ‌నెత్తిన అనేక సందేహాల‌కు ప్ర‌భుత్వం స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంద‌ని.. లేఖ‌లో స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని ఎస్సీ కమిషన్‌కు కొందరు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కమిషన్.. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జూన్‌లో అప్పటి సీఎస్‌కు లేఖ రాసింది. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోందో చెప్పాల‌ని పేర్కొంది. అయితే.. గ‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా ప్ర‌బుత్వం కూడా దీనిని లైట్ తీసుకుంది. కానీ, రాజ్యాంగ బ‌ద్ధ‌మైన క‌మిష‌న్ మ‌రోసారి ఘాటుగా లేఖ రాసింది. ఎస్సీ కమిషన్ లేఖపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదో చెప్పాల‌ని.. పేర్కొంటూ ప్రభుత్వంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎస్‌కు మరోసారి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్…వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రంలో విశాఖ‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోను, నెల్లూరు, క‌డ‌ప జిల్లాలోనూ.. కొంద‌రిని ఎస్సీలుగా పేర్కొంటూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. అయితే.. వీరంతా మ‌త మార్పిడి చేయించుకున్న‌వారేన‌ని.. ఎస్సీలుకార‌ని.. పేర్కొంటూ.. కొంద‌రు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. దీనిలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు కూడా ఉన్నారు. వీరంతా సాక్ష్యాల‌తోపాటు.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. దీనిపై కొంద‌రు మంత్రులు.. ఎదురు దాడి చేశారే త‌ప్ప స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో వారంతా.. ఎస్సీ క‌మిష‌న్‌లో ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్ప‌టికే రెండు సార్లు విచార‌ణ చేసిన క‌మిష‌న్ ప్ర‌భుత్వ వాద‌న వినేందుకు జూన్‌లోనే లేఖ రాసింది. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం స్పందించ‌లేదు.

This post was last modified on November 17, 2021 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

2 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

8 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

10 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

10 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

11 hours ago