జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని రకాలుగా ఆయన కష్టపడ్డా.. ప్రజల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మారడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న పవన్.. అందుకోసం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తన అన్నయ్య చిరంజీవి బాటలో సాగాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్లాలని పవన్ అనుకుంటున్నట్లు టాక్.
2009 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో టీడీపీకి.. అటు కేంద్రంలో బీజేపీకి మద్దతునిచ్చిన పవన్ పోటీ చేయకుండా ఉండిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి ఘోరమైన పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. తాను పోటి చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.
ఇప్పుడు బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఆ పొత్తుతో తన పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనే నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. పవన్కు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంది. అది వీలుకాకపోతే కనీసం ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని అయినా దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో జనసేనకు మెరుగైన ఫలితాలు రావాలి.
పవన్కు జనాల్లో క్రేజ్ ఉంది. ఇప్పుడా క్రేజ్ను పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు పవన్ రంగంలోకి దిగనున్నారు. ఏడాది పాటు జనంలో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పవన్ అన్నయ్య చిరంజీవి అప్పుడు బస్సు యాత్ర చేస్తే మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో సాగాలని అనుకుంటున్నారని సమాచారం. మొదట్లో పాదయాత్రనే చేయాలని అనుకున్నప్పటికీ.. సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని అభిమానుల కారణంగా సమస్యల వస్తే బాగుండదని పవన్ అనుకుంటున్నారు. అందుకే బస్సు యాత్ర చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు.
175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ తన టీమ్ను ఆదేశించారని సమాచారం. ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున ఈ యాత్ర కొనసాగేలా ప్లాన్ రూపొందించనున్నారని తెలుస్తోంది.
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…