Political News

అన్న‌య్య బాట‌లో ప‌వ‌న్‌

జ‌న‌సేన పార్టీని స్థాపించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని ర‌కాలుగా ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మార‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్‌.. అందుకోసం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు త‌న అన్న‌య్య చిరంజీవి బాట‌లో సాగాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. బ‌స్సు యాత్ర‌ తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లు టాక్‌.

2009 ఎన్నిక‌ల్లో ఇటు రాష్ట్రంలో టీడీపీకి.. అటు కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తునిచ్చిన ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా ఉండిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగి ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. తాను పోటి చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

ఇప్పుడు బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంది. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ పొత్తుతో త‌న పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌నే నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. ప‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆశ ఉంది. అది వీలుకాక‌పోతే క‌నీసం ముఖ్య‌మంత్రిని నిర్ణ‌యించే అధికారాన్ని అయినా ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. అందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు మెరుగైన ఫ‌లితాలు రావాలి.

ప‌వ‌న్‌కు జ‌నాల్లో క్రేజ్ ఉంది. ఇప్పుడా క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప‌వ‌న్ రంగంలోకి దిగ‌నున్నారు. ఏడాది పాటు జ‌నంలో ఉండేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన ప‌వ‌న్ అన్న‌య్య చిరంజీవి అప్పుడు బ‌స్సు యాత్ర చేస్తే మంచి స్పంద‌న వ‌చ్చింది. కాబ‌ట్టి ఇప్పుడు ప‌వ‌న్ కూడా అదే బాట‌లో సాగాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. మొద‌ట్లో పాద‌యాత్ర‌నే చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. సెక్యూరిటీ ప‌రంగా ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అభిమానుల కార‌ణంగా స‌మ‌స్య‌ల వ‌స్తే బాగుండ‌ద‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారు. అందుకే బ‌స్సు యాత్ర చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నారు.

175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ బ‌స్సు యాత్ర ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని ప‌వ‌న్ త‌న టీమ్‌ను ఆదేశించార‌ని స‌మాచారం. ప్ర‌తి నెల రెండు జిల్లాల చొప్పున ఈ యాత్ర కొన‌సాగేలా ప్లాన్ రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago