Political News

టీడీపీపై దాడి.. జ‌న‌సేనాని ఏమ‌న్నాడంటే?

మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లు చోట్ల‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని భావిస్తున్నారు.

ఈ దాడుల‌పై ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ దాడుల‌పై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ఆయ‌న ఈమేర‌కు ఒక వీడియో బైట్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో ప‌వ‌న్ ఏమ‌న్నాడంటే..

‘‘జ‌న‌సేన ఐటీ విభాగానికి సంబంధించిన స‌మావేశంలో ఉండ‌గా ఇప్పుడే ఒక వార్త తెలిసింది. విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసుల మీద.. అలాగే విశాఖ‌ప‌ట్నం, ప్రొద్దుటూరు నాయ‌కుల మీద దాడులు జ‌రిగాయని. ఇంత‌కుముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే లేని విధంగా మొట్ట‌మొద‌టిసారి పార్టీ ఆఫీసుల మీద ఇలా దాడి చేశారు. ఈ సంస్కృతి ప్ర‌జాస్వామ్యానికి ఏమాత్రం క్షేమ‌కరం కాదు. మేమెప్పుడు చెప్పేది ఒక‌టే. ప్ర‌జాస్వామ్యంలో నియంత్ర‌ణ పాటించాలి. వ్య‌క్తిగ‌తంగా దాడుల‌కు పాల్ప‌డ‌టం కానీ, పార్టీ ఆఫీసులు, నాయ‌కుల ఇళ్ల మీద దాడులు చేయ‌డం కానీ.. అది అరాచ‌కానికి, దౌర్జ‌న్యానికి దారి తీస్తుంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాదు. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా దృష్టిసారించాలి. కేంద్ర హోం శాఖ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు శాఖ కూడా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌క్కుండా చూడాలి. దోషుల‌ను ప‌ట్టుకుని శిక్షించ‌క‌పోతే అది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదు. దాడులు చేసిన వాళ్లు వైసీపీ వాళ్ల‌ని అంటున్నారు. వైసీపీ నాయ‌క‌త్వానికి కూడా ఒక‌టే తెలియ‌జేస్తున్నా. ఇలాంటి పోక‌డ‌లు నియంత్రించుకోకుంటే ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టు, ద‌య‌చేసి ఇలాంటివి స‌రి చేసుకోండి’’ అని ప‌వ‌న్ పేర్కొన్నాడు.

This post was last modified on October 19, 2021 11:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

11 minutes ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

14 minutes ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

25 minutes ago

ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…

43 minutes ago

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

1 hour ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

2 hours ago