Political News

టీడీపీపై దాడి.. జ‌న‌సేనాని ఏమ‌న్నాడంటే?

మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లు చోట్ల‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని భావిస్తున్నారు.

ఈ దాడుల‌పై ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ దాడుల‌పై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ఆయ‌న ఈమేర‌కు ఒక వీడియో బైట్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో ప‌వ‌న్ ఏమ‌న్నాడంటే..

‘‘జ‌న‌సేన ఐటీ విభాగానికి సంబంధించిన స‌మావేశంలో ఉండ‌గా ఇప్పుడే ఒక వార్త తెలిసింది. విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసుల మీద.. అలాగే విశాఖ‌ప‌ట్నం, ప్రొద్దుటూరు నాయ‌కుల మీద దాడులు జ‌రిగాయని. ఇంత‌కుముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే లేని విధంగా మొట్ట‌మొద‌టిసారి పార్టీ ఆఫీసుల మీద ఇలా దాడి చేశారు. ఈ సంస్కృతి ప్ర‌జాస్వామ్యానికి ఏమాత్రం క్షేమ‌కరం కాదు. మేమెప్పుడు చెప్పేది ఒక‌టే. ప్ర‌జాస్వామ్యంలో నియంత్ర‌ణ పాటించాలి. వ్య‌క్తిగ‌తంగా దాడుల‌కు పాల్ప‌డ‌టం కానీ, పార్టీ ఆఫీసులు, నాయ‌కుల ఇళ్ల మీద దాడులు చేయ‌డం కానీ.. అది అరాచ‌కానికి, దౌర్జ‌న్యానికి దారి తీస్తుంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాదు. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా దృష్టిసారించాలి. కేంద్ర హోం శాఖ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు శాఖ కూడా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌క్కుండా చూడాలి. దోషుల‌ను ప‌ట్టుకుని శిక్షించ‌క‌పోతే అది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదు. దాడులు చేసిన వాళ్లు వైసీపీ వాళ్ల‌ని అంటున్నారు. వైసీపీ నాయ‌క‌త్వానికి కూడా ఒక‌టే తెలియ‌జేస్తున్నా. ఇలాంటి పోక‌డ‌లు నియంత్రించుకోకుంటే ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టు, ద‌య‌చేసి ఇలాంటివి స‌రి చేసుకోండి’’ అని ప‌వ‌న్ పేర్కొన్నాడు.

This post was last modified on October 19, 2021 11:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago