మంగళవారం ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో దాడులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని భావిస్తున్నారు.
ఈ దాడులపై ఇప్పటికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ దాడులపై తన స్పందనను తెలియజేశారు. ఆయన ఈమేరకు ఒక వీడియో బైట్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో పవన్ ఏమన్నాడంటే..
‘‘జనసేన ఐటీ విభాగానికి సంబంధించిన సమావేశంలో ఉండగా ఇప్పుడే ఒక వార్త తెలిసింది. విజయవాడ, మంగళగిరి టీడీపీ ఆఫీసుల మీద.. అలాగే విశాఖపట్నం, ప్రొద్దుటూరు నాయకుల మీద దాడులు జరిగాయని. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసుల మీద ఇలా దాడి చేశారు. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మేమెప్పుడు చెప్పేది ఒకటే. ప్రజాస్వామ్యంలో నియంత్రణ పాటించాలి. వ్యక్తిగతంగా దాడులకు పాల్పడటం కానీ, పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం కానీ.. అది అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తుంది తప్ప ప్రజలకు, ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం క్షేమకరం కాదు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిసారించాలి. కేంద్ర హోం శాఖ తగు చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కూడా వెంటనే చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా చూడాలి. దోషులను పట్టుకుని శిక్షించకపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దాడులు చేసిన వాళ్లు వైసీపీ వాళ్లని అంటున్నారు. వైసీపీ నాయకత్వానికి కూడా ఒకటే తెలియజేస్తున్నా. ఇలాంటి పోకడలు నియంత్రించుకోకుంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు, దయచేసి ఇలాంటివి సరి చేసుకోండి’’ అని పవన్ పేర్కొన్నాడు.
This post was last modified on October 19, 2021 11:15 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…