కొన్ని విషయాల్లో సంప్రదాయ రాజకీయ నాయకులతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతి దాన్నీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడకుండా మంచి పనులు చేయడానికి అతను ముందుకొస్తుంటాడు. అలా ఆలోచించేవాడే అయితే.. సైన్యం కోసమని.. వరద బాధితుల కోసమని కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశాం.
ఇప్పుడు పవన్ ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. జనం మరిచిపోతున్న ఓ గొప్ప నాయకుడిని తర్వాతి తరాలు గుర్తుంచుకునేలా.. ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి కోటి రూపాయల నిధిని కేటాయించాడు జనసేనాని. ఆ నాయకుడు ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య.
కర్నూలు జిల్లాలో పేద, దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య.. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళిత నేతగా ఘనత వహించారు. 1960-62 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజీవయ్యను మరణానంతరం అందరూ మరిచిపోయారు. సంజీవయ్య తర్వాతి తరం వారు కూడా పట్టించుకోకపోవడంతో ఇల్లు కూలిపోయి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ పాడైపోయిన స్థితి గురించి తెలుసుకున్న జనసేనాని.. సంజీవయ్య ఇంటిని, ఆయన వస్తువులను కాపాడి తర్వాతి తరాలకు ఆయన గురించి తెలియజెప్పే ప్రయత్నానికి పూనుకున్నాడు.
ఇందుకోసం కోటి రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా సంజీవయ్య గొప్పదనాన్ని చాటే కొన్ని విషయాలను కూడా పవన్ ట్విట్టర్లో పంచుకున్నాడు. ఒక గొప్ప నేత గురించి తర్వాతి తరాలకు తెలియజెప్పాలనే పవన్ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
This post was last modified on October 17, 2021 6:41 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…