కొన్ని విషయాల్లో సంప్రదాయ రాజకీయ నాయకులతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతి దాన్నీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడకుండా మంచి పనులు చేయడానికి అతను ముందుకొస్తుంటాడు. అలా ఆలోచించేవాడే అయితే.. సైన్యం కోసమని.. వరద బాధితుల కోసమని కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశాం.
ఇప్పుడు పవన్ ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. జనం మరిచిపోతున్న ఓ గొప్ప నాయకుడిని తర్వాతి తరాలు గుర్తుంచుకునేలా.. ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి కోటి రూపాయల నిధిని కేటాయించాడు జనసేనాని. ఆ నాయకుడు ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య.
కర్నూలు జిల్లాలో పేద, దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య.. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళిత నేతగా ఘనత వహించారు. 1960-62 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజీవయ్యను మరణానంతరం అందరూ మరిచిపోయారు. సంజీవయ్య తర్వాతి తరం వారు కూడా పట్టించుకోకపోవడంతో ఇల్లు కూలిపోయి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ పాడైపోయిన స్థితి గురించి తెలుసుకున్న జనసేనాని.. సంజీవయ్య ఇంటిని, ఆయన వస్తువులను కాపాడి తర్వాతి తరాలకు ఆయన గురించి తెలియజెప్పే ప్రయత్నానికి పూనుకున్నాడు.
ఇందుకోసం కోటి రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా సంజీవయ్య గొప్పదనాన్ని చాటే కొన్ని విషయాలను కూడా పవన్ ట్విట్టర్లో పంచుకున్నాడు. ఒక గొప్ప నేత గురించి తర్వాతి తరాలకు తెలియజెప్పాలనే పవన్ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…