ఆంధ్రప్రదేశ్లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య ఈ మార్చిలో చనిపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నిక జరగబోతోంది. వెంకటసుబ్బయ్య స్థానంలో ఆయన భార్య డాక్టర్ సుధనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయినపుడు వారి కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపితే.. ఏకగ్రీవం కోసం సహకారం అందించే సంప్రదాయాన్ని చాలా పార్టీలు పాటిస్తున్నాయి. తెలుగుదేశం ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంది.
జనసేన సైతం అదే బాటలో పయనిస్తూ తాము అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించింది. ఐతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అందుకు అంగీకరించలేదు. బీజేపీ సరసన పుంతల సురేష్ను అభ్యర్థిగా ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఐతే జనసేనకు బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఎన్నికల విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయాన్ని గౌరవించి జనసేన ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందే. వేరే అభ్యర్థులకు కూడా జనసైనికులు మద్దతు ఇవ్వకూడదు. బీజేపీతో పొత్తు ధర్మం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనూ కొంత కాలంగా జనసేనకు, బీజేపీకి మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ‘సంప్రదాయం’ పేరు చెప్పి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టొచ్చు. ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండొచ్చు. కానీ జనసేన అలా చేయట్లేదు. అభ్యర్థిని నిలపకుండా టీడీపీ బాటలో పయనించడంతో వైకాపాకు మద్దతుగా నిలిచే మీడియా వర్గాలు.. జనసేనకు పొత్తు ఉన్నది బీజేపీతోనా, టీడీపీతోనా అని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో జనసేన అప్రమత్తమైంది.
బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన పూర్తి మద్దతు ఉంటుందని, జనసైనికులు సురేష్కు పూర్తి మద్దతు ఇవ్వాలని పార్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ శనివారం స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే ఓవైపు సంప్రదాయాన్ని అనుసరించి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, ఇప్పుడేమో పొత్తు ధర్మం పేరు చెప్పి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో జనసైనికులకే అంతుబట్టడం లేదు.
This post was last modified on October 9, 2021 6:16 pm
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…