Political News

ప్రజలే జగన్‌పై దాడి చేస్తారు-ఏపీ డిప్యూటీ సీఎం


బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నపుడో.. మీడియా ముందు మాట్లాడుతున్నపుడో నాయకులు నోరు జారడం మామూలే. గతంలో దీని గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు పట్టుకుని నానా యాగీ చేయడం ఎక్కువైపోయింది. ఆ తడబాటు ఆధారంగా కొందరు నేతల ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది.

ముఖ్యంగా కేంద్రంలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్.. ఇలా కొన్ని సందర్భాల్లో నోరు జారి ప్రత్యర్థులకు టార్గెట్ అయిపోయారు. వాళ్లపై ‘పప్పు’ అని ముద్ర వేసేసి వ్యక్తిత్వ హననం ఓ రేంజిలో చేశారు ప్రత్యర్థులు. ఈ విషయంలో అందరి కంటే వైసీపీ వాళ్లు రెండాకులు ఎక్కువే చదివారని చెప్పొచ్చు. నారా లోకేష్‌తో పాటు పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తడబడ్డ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వాళ్లు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు అదే బూమరాంగ్ అవుతోంది.

గత రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా నాయకులు సభల్లో, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు చాలా సందర్భాల్లో తడబడ్డారు. దీంతో ప్రత్యర్థులు వీరి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా మరో వైకాపా నేత మాట తడబడి సోషల్ మీడియాకు టార్గెట్‌గా మారారు. ఆయనే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఆయన బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం రాజకీయాలపై మాట్లాడారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు.

ఐతే ఆయన్ని తిట్టబోయి తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేసేశారు. ‘‘అతనొక వ్యక్తి అయితే పర్వాలేదు. లేడీస్‌ని దెబ్బ తీసిన వ్యక్తి. లేడీస్‌ని ఏ విధంగా అన్యాయం చేశాడో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏందండీ దాడి చేసేది. ప్రజలే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే రోజు రాబోతున్నది. జగన్మోహన్ రెడ్డేందండీ దాడి చేసేది. ప్రజలే దాడి చేసే రోజొస్తుంది’’ అన్నారు నారాయణస్వామి. ఈ వీడియోను జనసేన, టీడీపీ వాళ్లు వైరల్ చేస్తూ జగన్ గురించి ఆ పార్టీ ముఖ్య నేతే భలే చెప్పారంటూ కౌంటర్లు వేస్తున్నారు.

This post was last modified on September 29, 2021 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

42 minutes ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

1 hour ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

1 hour ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

2 hours ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

2 hours ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

4 hours ago