Political News

సజ్జల మాటలకు అర్థముందా ?

ప్రజాప్రతినిధులు మరణిస్తే జరిగే ఉపఎన్నికల్లో వాళ్ళ కుటుంబసభ్యులనే పోటీలోకి దించే సంప్రదాయం వైసీపీలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అలాగే ఏ పార్టీ ప్రజా ప్రతినిధి మరణించినా జరిగే ఉపఎన్నికలో ఇతర పార్టీలు అభ్యర్ధిని దించకూడదనే సంప్రదాయాన్ని కూడా సజ్జల గుర్తుచేశారు. ఈ సంప్రదాయం ప్రకారం తొందరలో జరగబోయే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రత్యర్ధిపార్టీలు అభ్యర్ధులకు పోటీకి దించకూడదని విజ్ఞప్తి చేశారు.

విజ్ఞప్తి చేయటంలో తప్పేమీ లేదు. కానీ సంప్రదాయం పేరుతో ఏది పడితే అది మాట్లాడటమే ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులు చనిపోతే జరిగే ఉపఎన్నికల్లో వారి కుటుంబసభ్యులనే పోటీలోకి దించాలనే సంప్రదాయం ఉన్నది కరెక్టే. దాని ప్రకారం బద్వేలులో దివంగత ఎంఎల్ఏ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను వైసీపీ పోటీలోకి దింపుతోంది. ఇంతవరకు కరెక్టే కానీ మరి ఇదే సంప్రదాయం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఏమైంది ? అన్నదే ప్రశ్న.

తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. సంప్రదాయం ప్రకారమైతే బల్లి కుటుంబసభ్యులకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వాలి. కానీ కొత్త అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని జగన్ రంగంలోకి దించారు. పోటీకి ఆసక్తి చూపిన దివంగత ఎంపి బల్లి కుటుంబసభ్యులను కాదని కొత్త అభ్యర్ధిని జగన్ ఎందుకని రంగంలోకి దింపారు ? అనే ప్రశ్నకు సజ్జల సమాధానం చెప్పాలి. అంటే తాము పెట్టుకున్న సంప్రదాయాన్ని వైసీపీనే ఉల్లంఘించింది.

తన సాంప్రదాయాన్ని వైసీపీనే ఉల్లంఘించినపుడు ఇతర పార్టీలు ఎందుకని గౌరవిస్తాయి. ఒకప్పడు కృష్ణాజిల్లాలోని నందిగామ టీడీపీ ఎంఎల్ఏ తంగిరాల ప్రభాకర్ మరణించిన తర్వాత జరిగిన ఉపఎన్నికలో వైసీపీ పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం పోటీలో ఉంది. ఈ కారణంగానే అప్పట్లో ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్ కూతురు సౌమ్యను ఫోటో చేయించిన కారణంగానే వైసీపీ పోటీ చేయలేదు. కానీ తిరుపతిలో ఆ సంప్రదాయాన్ని స్వయంగా వైసీపీనే ఉల్లంఘించింది.

తిరుపతిలో సంప్రదాయాన్ని ఎందుకు ఉల్లంఘించింది ? బద్వేలులో ఎందుకు పాటిస్తోందో తెలీదు. నిజానికి పోటీ చేయాలా ? వద్దా అనేది ఆయా పార్టీల ఇష్టం. ఈ విషయంలో సజ్జల ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తిగా పార్టీల ఇష్టమే. చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులనే పోటీ చేయించాలని కూడా ఏమీ లేదు. ఏదో సంప్రదాయం పేరుతో సాగినంత కాలం సాగింది తర్వాత బ్రేక్ పడింది. కాబట్టి సంప్రదాయం పేరుతో కాకుండా ఎవరి సత్తా వాళ్ళు చూపించటమే ఉత్తమం.

Satya

Recent Posts

వార‌ణాసి విల‌న్‌ క్యారెక్టర్… రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

రాజమౌళి, మ‌హేష్ బాబుల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న వార‌ణాసి సినిమాలో రామాయ‌ణం నేప‌థ్యంలో ఒక అరగంట యుద్ధ స‌న్నివేశాలు ఉంటాయ‌ని…

3 hours ago

సాయిపల్లవి వదులుకుంటే సమంత అందుకుంది

జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…

4 hours ago

అక్కడ తోటి పిల్లలే టీచర్లు…

ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…

6 hours ago

ఒకే సినిమాలో 200 పాటలు

తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…

6 hours ago

ఉప్పెనకు ప్లస్సు… పెద్దికదే మైనస్సు

సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…

6 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… మోడీ స‌మీక్ష‌?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మ సంఘం నాయ‌కుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫ‌లించింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల…

9 hours ago