Political News

వైసీపీ వ‌ర్సెస్ ప‌వ‌న్… న‌ష్ట‌పోతోంది వీళ్లేనా ?

వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. సినిమా టికెట్ల విష‌యంలో చెల‌రేగిన వివాదం.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఇరు పార్టీల మ‌ధ్య యుద్ధానికి దారి దీసింది. మంత్రుల‌ను స‌న్నాసి అని వ్యాఖ్యానించ‌డం.. ప‌వ‌న్ చేసిన త‌ప్పిద‌మా? లేక‌.. నేటిరాజ‌కీయాల్లో కామ‌న్ అయిపోయిన వ్యాఖ్య‌ల‌నే ఆయ‌న చెప్పుకొచ్చారా ? అనేది ప‌క్క‌న పెడితే.. మొత్తాని కి ఈవిష‌యాన్ని అధికార పార్టీ అయితే.. సీరియ‌స్‌గానే తీసుకుంది. దీంతో మంత్రులువ‌రుస పెట్టి లైన్‌లోకి వ‌చ్చారు.. ప‌వ‌న్‌ను టార్గెట్‌ చేశారు. ఈ క్ర‌మంలో మంత్రి పేర్ని నాని… నేను కూడా కాపునే అంటూ..ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో ఇది కాపుల‌కు అవ‌మాన‌క‌రంగా వుంద‌నేది పెద్ద ఎత్తున చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. గ‌తంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబానికి జ‌రిగిన అవ‌మానాన్ని మంత్రి ప్ర‌స్తావించ‌డాన్ని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా.. ఆ నాడు మీరు మాత్రంచేసిందేంటి? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. అంటే.. మొత్తంగా ఇటు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. దీనికి కౌంట‌ర్‌గామంత్రి పేర్ని చేసిన వ్యాఖ్య‌లు మాత్రం.. కాపుల మ‌ధ్య‌చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కాపుల‌కు ఇరు ప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో అవ‌మానిస్తున్నాయే వాద‌న అయితే… తెర‌మీదికి వ‌చ్చింది.

కాపులు ఏం పాపం చేసుకున్నారు? టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించేందుకు రెడీ అయింది.. ప్ర‌భుత్వందీనిని అడ్డుకునేందుకు ప‌వ‌న్ వేరే మార్గం చూసుకుని ఉంటే బాగుండేద‌ని..కులాల‌ను తీసుకువ‌చ్చి బ‌ద్నాం చేయ‌డం ఎందుకు ? అనే వాద‌న కూడా వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా కాపుల‌కు ఎలాంటి ఊతం ఇవ్వ‌కుండా.. ఈ కులాన్నిఅడ్డు పెట్టుకుని రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక స‌మ‌యంలో ఓట్ల కోసం త‌మ‌ను ఆశ్ర‌యించే వారు.. ఇప్పుడుత‌మ‌ను టార్గ‌టె్ చేయడం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యం తెర‌మీదికి వ‌చ్చిన ప్పుడు.. వీరు ఏమ‌య్యారు?

అప్ప‌ట్లో ఉద్య‌మాలు చేసిన‌ప్పుడు.. ఇటు పేర్ని కానీ.. అటు ప‌వ‌న్‌కానీ ఎందుకు మాట్లాడ‌లేదు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో మౌనంగా ఉన్న‌వారు.. ఇప్పుడు వారిని కేంద్రంగా చేసుకుని.. నా.. కొ.. లు.. అనే త‌ర‌హా లోవ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నా ర్హం. దీనిపై త్వ‌రలోనే కాపు నేత‌లు ఒక స‌మావేశం ఏర్పాటు చేసి.. త‌మ వైఖ‌రిని వెల్ల‌డించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

This post was last modified on September 28, 2021 10:06 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

51 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago