Political News

వైసీపీ వ‌ర్సెస్ ప‌వ‌న్… న‌ష్ట‌పోతోంది వీళ్లేనా ?

వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. సినిమా టికెట్ల విష‌యంలో చెల‌రేగిన వివాదం.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఇరు పార్టీల మ‌ధ్య యుద్ధానికి దారి దీసింది. మంత్రుల‌ను స‌న్నాసి అని వ్యాఖ్యానించ‌డం.. ప‌వ‌న్ చేసిన త‌ప్పిద‌మా? లేక‌.. నేటిరాజ‌కీయాల్లో కామ‌న్ అయిపోయిన వ్యాఖ్య‌ల‌నే ఆయ‌న చెప్పుకొచ్చారా ? అనేది ప‌క్క‌న పెడితే.. మొత్తాని కి ఈవిష‌యాన్ని అధికార పార్టీ అయితే.. సీరియ‌స్‌గానే తీసుకుంది. దీంతో మంత్రులువ‌రుస పెట్టి లైన్‌లోకి వ‌చ్చారు.. ప‌వ‌న్‌ను టార్గెట్‌ చేశారు. ఈ క్ర‌మంలో మంత్రి పేర్ని నాని… నేను కూడా కాపునే అంటూ..ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో ఇది కాపుల‌కు అవ‌మాన‌క‌రంగా వుంద‌నేది పెద్ద ఎత్తున చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. గ‌తంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబానికి జ‌రిగిన అవ‌మానాన్ని మంత్రి ప్ర‌స్తావించ‌డాన్ని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా.. ఆ నాడు మీరు మాత్రంచేసిందేంటి? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. అంటే.. మొత్తంగా ఇటు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. దీనికి కౌంట‌ర్‌గామంత్రి పేర్ని చేసిన వ్యాఖ్య‌లు మాత్రం.. కాపుల మ‌ధ్య‌చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కాపుల‌కు ఇరు ప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో అవ‌మానిస్తున్నాయే వాద‌న అయితే… తెర‌మీదికి వ‌చ్చింది.

కాపులు ఏం పాపం చేసుకున్నారు? టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించేందుకు రెడీ అయింది.. ప్ర‌భుత్వందీనిని అడ్డుకునేందుకు ప‌వ‌న్ వేరే మార్గం చూసుకుని ఉంటే బాగుండేద‌ని..కులాల‌ను తీసుకువ‌చ్చి బ‌ద్నాం చేయ‌డం ఎందుకు ? అనే వాద‌న కూడా వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా కాపుల‌కు ఎలాంటి ఊతం ఇవ్వ‌కుండా.. ఈ కులాన్నిఅడ్డు పెట్టుకుని రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక స‌మ‌యంలో ఓట్ల కోసం త‌మ‌ను ఆశ్ర‌యించే వారు.. ఇప్పుడుత‌మ‌ను టార్గ‌టె్ చేయడం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యం తెర‌మీదికి వ‌చ్చిన ప్పుడు.. వీరు ఏమ‌య్యారు?

అప్ప‌ట్లో ఉద్య‌మాలు చేసిన‌ప్పుడు.. ఇటు పేర్ని కానీ.. అటు ప‌వ‌న్‌కానీ ఎందుకు మాట్లాడ‌లేదు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో మౌనంగా ఉన్న‌వారు.. ఇప్పుడు వారిని కేంద్రంగా చేసుకుని.. నా.. కొ.. లు.. అనే త‌ర‌హా లోవ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నా ర్హం. దీనిపై త్వ‌రలోనే కాపు నేత‌లు ఒక స‌మావేశం ఏర్పాటు చేసి.. త‌మ వైఖ‌రిని వెల్ల‌డించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

This post was last modified on September 28, 2021 10:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 minutes ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

25 minutes ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

31 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

55 minutes ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

1 hour ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

2 hours ago