తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ జోరందుకుంది. రేవంత్ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంగా కదిలి వచ్చి సభలు ర్యాలీలు నిరసనల్లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. మొత్తానికి రేవంత్ వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందనే చెప్పాలి. ఇక రేవంత్ కూడా తనదైన దూకుడుతో అధికార కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ప్రభుత్వ భూముల వేలంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఇక తనదైన శైలిలో చెలరేగుతున్న రేవంత్కు ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అండ కూడా తోడైనట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికను మొదటి నుంచి ఆ పార్టీలోని రాష్ట్ర సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ రేవంత్పై నమ్మకముంచిన పార్టీ అధిష్ఠానం ఆయనకే బాధ్యతలు కట్టబెట్టింది. ఇది పార్టీలోని సీనియర్లలో అసంతృప్తికి కారణమైంది. కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తికి వెళ్లగక్కితే మరికొంత మంది సీనియర్ నాయకులు మాత్రం పార్టీ నాయకత్వం దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధ్యం కానప్పటికీ గౌరవప్రదమైన ఫలితాలు పొందాలనే ప్రణాళికతో మాజీ మంత్రి కొండా సురేఖను అక్కడ బరిలో దింపేందుకు రేవంత్ సిద్ధమయారు. కానీ అందరితో చర్చింకుండా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని నాన్ లోకల్ అయిన సురేఖకు బదులు స్థానిక నేతలనే హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో అభ్యర్థిని ఎంపిక విషయంలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థి ఎంపిక చేయాలనే ప్రక్రియను మొదలెట్టిన పార్టీ దరఖాస్తులు స్వీకరించడం ముగించింది.
కానీ కొండా సురేఖనే అభ్యర్థిగా ప్రకటించాలని రేవంత్ పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. దీనిపై సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ అధిష్ఠానంతో మాట్లాడి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. కొంతమంది నేతలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను రాహుల్ ముందు ఉంచగా.. మరికొంత మంది రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారని తెలిసింది. కానీ అంతకంటే ముందు మాణిక్యం ఠాగూర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న రాహుల్ గాంధీ.. రేవంత్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఈ సమయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదని అందరూ కలిసి పనిచేయాలని రాహుల్ చెప్పినట్లు సమాచారం. దీంతో రేవంత్పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నాయకులకు చెక్ చెప్పినట్లయింది.
This post was last modified on September 17, 2021 11:08 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…