మిత్రపక్షాల మధ్య ఇప్పటినుంచైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఉద్యమాలు జరుగుతాయా ? ఇపుడిదే అంశంపై రెండుపార్టీల్లోను చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ+జనసేన నేతల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతలు కూడా పాల్గొన్నారు.
వీళ్ళ సమావేశం తర్వాత కూడా రెండుపార్టీల్లోను జాయింట్ ఆందోళనలపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సమావేశాలు చాలానే జరిగాయి. అయితే సమావేశాలు ఎన్ని జరిగినా ఆచరణలోకైతే పెద్దగా రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రెండు పార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీల అగ్రనేతల మధ్య సరైన సమన్వయం లేదన్నది వాస్తవం. బహుశా వీర్రాజు, పవన్ కల్యాణ్ మధ్య ఇగో ప్రాబ్లమ్ ఏమన్నా అడ్డొస్తున్నదేమో అర్ధం కావటంలేదు. ఇద్దరు అగ్రనేతలు కలిసి జాయింట్ గా నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవటంతోనే అందరిలోను ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. అలాగే పవన్ ఆధ్వర్యంలో కూడా సమావేశాలు, నిరసనలు జరిగాయి. కానీ జాయింటుగా మాత్రం జరగలేదు.
సమావేశాలు పెట్టుకోవడం, ఆందోళనలు చేయాలని నిర్ణయించడం రెండు పార్టీల అగ్రనేతలకు మామూలైపోయింది. ఆచరణలో కనిపించని నిర్ణయాలకు ఎన్ని సమావేశాలు పెట్టుకుంటే మాత్రమేమిటనే ప్రశ్న రెండు పార్టీల నేతల్లోను వినిపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే విజయవాడలో మిత్రపక్షాల అగ్రనేతల మధ్య తాజాగా సమావేశం జరగడం రెండు పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇప్పటినుంచైనా నేతలు కలిసి పోరాటాలు చేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.
This post was last modified on August 15, 2021 11:16 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…