మిత్రపక్షాల మధ్య ఇప్పటినుంచైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఉద్యమాలు జరుగుతాయా ? ఇపుడిదే అంశంపై రెండుపార్టీల్లోను చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ+జనసేన నేతల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతలు కూడా పాల్గొన్నారు.
వీళ్ళ సమావేశం తర్వాత కూడా రెండుపార్టీల్లోను జాయింట్ ఆందోళనలపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సమావేశాలు చాలానే జరిగాయి. అయితే సమావేశాలు ఎన్ని జరిగినా ఆచరణలోకైతే పెద్దగా రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రెండు పార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీల అగ్రనేతల మధ్య సరైన సమన్వయం లేదన్నది వాస్తవం. బహుశా వీర్రాజు, పవన్ కల్యాణ్ మధ్య ఇగో ప్రాబ్లమ్ ఏమన్నా అడ్డొస్తున్నదేమో అర్ధం కావటంలేదు. ఇద్దరు అగ్రనేతలు కలిసి జాయింట్ గా నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవటంతోనే అందరిలోను ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. అలాగే పవన్ ఆధ్వర్యంలో కూడా సమావేశాలు, నిరసనలు జరిగాయి. కానీ జాయింటుగా మాత్రం జరగలేదు.
సమావేశాలు పెట్టుకోవడం, ఆందోళనలు చేయాలని నిర్ణయించడం రెండు పార్టీల అగ్రనేతలకు మామూలైపోయింది. ఆచరణలో కనిపించని నిర్ణయాలకు ఎన్ని సమావేశాలు పెట్టుకుంటే మాత్రమేమిటనే ప్రశ్న రెండు పార్టీల నేతల్లోను వినిపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే విజయవాడలో మిత్రపక్షాల అగ్రనేతల మధ్య తాజాగా సమావేశం జరగడం రెండు పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇప్పటినుంచైనా నేతలు కలిసి పోరాటాలు చేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.
This post was last modified on August 15, 2021 11:16 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…