Political News

జాయింట్ ఉద్యమాలు జరిగే పనేనా ?

మిత్రపక్షాల మధ్య ఇప్పటినుంచైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఉద్యమాలు జరుగుతాయా ? ఇపుడిదే అంశంపై రెండుపార్టీల్లోను చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ+జనసేన నేతల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతలు కూడా పాల్గొన్నారు.

వీళ్ళ సమావేశం తర్వాత కూడా రెండుపార్టీల్లోను జాయింట్ ఆందోళనలపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సమావేశాలు చాలానే జరిగాయి. అయితే సమావేశాలు ఎన్ని జరిగినా ఆచరణలోకైతే పెద్దగా రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రెండు పార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీల అగ్రనేతల మధ్య సరైన సమన్వయం లేదన్నది వాస్తవం. బహుశా వీర్రాజు, పవన్ కల్యాణ్ మధ్య ఇగో ప్రాబ్లమ్ ఏమన్నా అడ్డొస్తున్నదేమో అర్ధం కావటంలేదు. ఇద్దరు అగ్రనేతలు కలిసి జాయింట్ గా నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవటంతోనే అందరిలోను ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. అలాగే పవన్ ఆధ్వర్యంలో కూడా సమావేశాలు, నిరసనలు జరిగాయి. కానీ జాయింటుగా మాత్రం జరగలేదు.

సమావేశాలు పెట్టుకోవడం, ఆందోళనలు చేయాలని నిర్ణయించడం రెండు పార్టీల అగ్రనేతలకు మామూలైపోయింది. ఆచరణలో కనిపించని నిర్ణయాలకు ఎన్ని సమావేశాలు పెట్టుకుంటే మాత్రమేమిటనే ప్రశ్న రెండు పార్టీల నేతల్లోను వినిపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే విజయవాడలో మిత్రపక్షాల అగ్రనేతల మధ్య తాజాగా సమావేశం జరగడం రెండు పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇప్పటినుంచైనా నేతలు కలిసి పోరాటాలు చేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.

Satya

Recent Posts

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

1 hour ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

4 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

13 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

13 hours ago

నిషేధం చిన్న చ‌ర్యే: టెలిగ్రామ్ యాప్‌కు కోర్టు షాక్‌!

త‌మ‌పై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాల‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌పై నిషేధం విధించింద‌ని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…

14 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

15 hours ago