మొత్తానికి తెలుగు సినిమా నిర్మాతల వేదన తీరబోతున్నట్లే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయన్న మాటే కానీ.. పూర్తి స్థాయిలో ఆదాయం మాత్రం రావట్లేదు. అందుక్కారణం కొన్ని నెలల కిందట ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా దశాబ్దం కిందటి రేట్లకు సంబంధించి జీవోను బయటికి తీసి అధికారులు కొరడా ఝులిపించడంతో ఇండస్ట్రీకి పెద్ద కష్టమే వచ్చింది. అసలే కరోనా వల్ల దారుణంగా దెబ్బ తిన్న థియేటర్ల వ్యవస్థకు ఈ జీవో అశనిపాతంలా మారింది.
ఏపీ ప్రభుత్వం పవన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ జీవోను బయటికి తీసి టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చిందన్నది బహిరంగ రహస్యం. కానీ అతణ్ని ఇబ్బంది పెట్టబోయి మొత్తం ఇండస్ట్రీ మెడకు చుట్టుకుంది. జగన్ సర్కారుకు ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది.
ఈ పరిస్థితుల్లో నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియని సంకట స్థితిలో పడింది జగన్ ప్రభుత్వం. వెంటనే నిర్ణయాన్ని మారిస్తే పవన్ను ఇబ్బంది పెట్టేందుకు తాత్కాలికంగా హడావుడి చేశారన్న సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. అందుకే కొన్నాళ్లు వేచి చూశారు. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం నుంచి టాలీవుడ్ పెద్దలకు చర్చల కోసం పిలుపు వెళ్లింది. ఈ విషయంలో జగన్ ఇగో పక్కన పెట్టి చిరు అండ్ కోకు కబురు పంపడం విశేషమే. టికెట్ల రేట్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వ వైఖరి మారకుంటే మున్ముందు అది జగన్కు మరింత చెడ్డ పేరు తేవచ్చు.
అందుకే ఇగో పక్కన పెట్టి సినీ పెద్దలకు జగన్ పిలుపు పంపినట్లు తెలుస్తోంది. మున్ముందు పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి. వాటికీ టికెట్ల నియంత్రణ తీసుకొస్తే ఏపీ ప్రభుత్వానికి అందరు హీరోల అభిమానుల నుంచి వ్యతిరేకత తప్పదు. అందుకే ఇప్పుడిలా పిలిచి మరీ మీటింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 15, 2021 11:27 am
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…