ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ (పీకే) తొందరలోనే కాంగ్రెస్ నేతగా పరిచయం కాబోతున్నారా ? కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పీకే తొందరలోనే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నట్లు జాతీయస్ధాయిలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిదే. సరే అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేతగా పీకే సక్సెస్ అవుతారా ? అనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది.
విషయం ఏమిటంటే రాజకీయ విశ్లేషకుడి అవతారం వేరు నేరుగా రాజకీయ నేతగా అవతారం ఎత్తడం వేరన్న విషయం అందరికీ తెలిసిందే. రెండింటికి చాలా తేడా ఉంది. అదేమింటే రాజకీయ విశ్లేషకుడంటే ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే పీకే చెప్పినట్లు వినాల్సిందే. పీకే ఒకటిచెప్పి పార్టీ అదినేత మరోవిధంగా నడుచుకుంటే వ్యూహకర్త వ్యూహాలు అమలు అయ్యే అవకాశాలు లేకపోతే పార్టీ గెలుపుపై ప్రభావం చూపటం ఖాయం. అలాగే పార్టీ అధినేతతో తప్ప పీకే ఇంకెవరితోను మాట్లాడరు. కాబ్టటి పీకే ఎప్పుడనుకుంటే అప్పుడు అధినేత మాట్లాడాల్సిందే. ఎందుకంటే వందల కోట్ల రూపాయలిచ్చి కోరి తెచ్చుకున్నారు కాబట్టి.
ఇక నేరుగా ఓ పార్టీలో చేరటమంటే కత వేరేరకంగా ఉంటుంది. ఎలాగంటే అనేక మంది నేతల్లో పీకే ఒకరైపోతారు. కాకపోతే చాలామంది నేతలకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికినా అన్నీసార్లు అలా దొరకదు. కాబట్టి పార్టీ అధినేత దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. పైగా పీకే సలహాలతో విభేదించే వారు పార్టీలో చాలామంది నేతలు రెడీగా ఉంటారు. ఎందుకంటే సీనియర్ నేతల్లో ఎవరి ఆధిపత్యం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి.
మరీ విషయాలు పీకేకి తెలీకుండానే ఉంటుందా ? పైగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది. ఏదో పార్టీ ఉందంటే ఉంది చాలా రాష్ట్రాల్లో. ఇలాంటి పరిస్ధితుల్లో పీకే చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం వచ్చేస్తుందని చెప్పటం కష్టం. నరేంద్రమోడి మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయి జనాలు తమంతట తాముగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనే పార్టీకి జీవం వస్తుంది. ఇన్ని క్లిష్ట పరిస్ధితుల్లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఏమి చేస్తారో చూడాల్సిందే.
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…