ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ (పీకే) తొందరలోనే కాంగ్రెస్ నేతగా పరిచయం కాబోతున్నారా ? కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పీకే తొందరలోనే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నట్లు జాతీయస్ధాయిలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిదే. సరే అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేతగా పీకే సక్సెస్ అవుతారా ? అనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది.
విషయం ఏమిటంటే రాజకీయ విశ్లేషకుడి అవతారం వేరు నేరుగా రాజకీయ నేతగా అవతారం ఎత్తడం వేరన్న విషయం అందరికీ తెలిసిందే. రెండింటికి చాలా తేడా ఉంది. అదేమింటే రాజకీయ విశ్లేషకుడంటే ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే పీకే చెప్పినట్లు వినాల్సిందే. పీకే ఒకటిచెప్పి పార్టీ అదినేత మరోవిధంగా నడుచుకుంటే వ్యూహకర్త వ్యూహాలు అమలు అయ్యే అవకాశాలు లేకపోతే పార్టీ గెలుపుపై ప్రభావం చూపటం ఖాయం. అలాగే పార్టీ అధినేతతో తప్ప పీకే ఇంకెవరితోను మాట్లాడరు. కాబ్టటి పీకే ఎప్పుడనుకుంటే అప్పుడు అధినేత మాట్లాడాల్సిందే. ఎందుకంటే వందల కోట్ల రూపాయలిచ్చి కోరి తెచ్చుకున్నారు కాబట్టి.
ఇక నేరుగా ఓ పార్టీలో చేరటమంటే కత వేరేరకంగా ఉంటుంది. ఎలాగంటే అనేక మంది నేతల్లో పీకే ఒకరైపోతారు. కాకపోతే చాలామంది నేతలకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికినా అన్నీసార్లు అలా దొరకదు. కాబట్టి పార్టీ అధినేత దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. పైగా పీకే సలహాలతో విభేదించే వారు పార్టీలో చాలామంది నేతలు రెడీగా ఉంటారు. ఎందుకంటే సీనియర్ నేతల్లో ఎవరి ఆధిపత్యం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి.
మరీ విషయాలు పీకేకి తెలీకుండానే ఉంటుందా ? పైగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది. ఏదో పార్టీ ఉందంటే ఉంది చాలా రాష్ట్రాల్లో. ఇలాంటి పరిస్ధితుల్లో పీకే చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం వచ్చేస్తుందని చెప్పటం కష్టం. నరేంద్రమోడి మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయి జనాలు తమంతట తాముగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనే పార్టీకి జీవం వస్తుంది. ఇన్ని క్లిష్ట పరిస్ధితుల్లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on July 21, 2021 11:21 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…