Political News

రచ్చరచ్చవుతున్న ట్యాపింగ్ దుమారం

దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు సోమవారం కథనాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కథనం ప్రకారం రాహూల్, ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు అశ్విన్ వైష్ణవ, ప్రహ్లాద్ సింగ్ పాటిల్ తో పాటు ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, ఓ జడ్జీ లాంటి అనేకమంది ఫోన్లు ట్యాప్ అయ్యింది.

దివైర్ లో వచ్చిన కథనం సరిగ్గా పార్లమెంటు సమావేశాల మొదటిరోజే కావటంతో సమావేశాల్లో మంటలు రేగింది. రోజంతా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైనే ప్రతిపక్షాలు గోల గోల చేశాయి. సరే ప్రభుత్వం ఎలాగూ ఫోన్ ట్యాపింగ్ కథనం తప్పుల తడకగా కొట్టేసింది. ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయించటం లేదని ప్రకటించింది. అయినా ప్రతిపక్షాలు పట్టించుకోవటంలేదు.

ఎందుకంటే ఒకవైపు ఉభయసభల్లో ట్యాపింగ్ పై రచ్చ జరుగుతుంగగానే వాషింగ్టన్ పోస్టు కూడా ది వైర్ కథనాన్ని దృవీకరిస్తు మరో కథనాన్ని ఇవ్వటమే. నిజానికి ప్రభుత్వంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ఉన్నా ప్రతిపక్షాలపై నిఘా ఉంచటం కొత్తేమీకాదు. ప్రభుత్వాన్ని రక్షించుకోవటం కోసం అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్ధలు, ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే లక్ష్యంతో ఎవరెరవరు ఏమేమి చేస్తున్నారనే విషయంలో ప్రభుత్వం నిఘా ఉంచుతుందనటంలో సందేహం లేదు.

కాకపోతే నిఘా జాబితాలోని ప్రముఖుల పేర్లు లీకైనపుడు ఇలాంటి రచ్చలు జరుగుతుంటాయి. గతంలో రాజీవ్ గాంధి, మన్మోహన్ సింగ్ హయాంలో కూడా బీజేపీ ఇలాంటి రచ్చే చేసింది. అధికారంలో ఉన్నపార్టీకి ప్రతిపక్షాలకు ఇలాంటి వివాదాలు సాధారణమే. కాకపోతే ఇపుడు ప్రతిపక్షంలోని ప్రముఖులు, వైరాలజీ సైంటిస్టులు, జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల పేర్లు లీకవ్వటంతో సమస్య కాస్త పెద్దదిగా కనబడుతోందంతే. మరి ఇపుడు రేగిన దుమారం ఎప్పుడు చల్లారుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 20, 2021 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

15 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

49 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago