Political News

రచ్చరచ్చవుతున్న ట్యాపింగ్ దుమారం

దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు సోమవారం కథనాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కథనం ప్రకారం రాహూల్, ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు అశ్విన్ వైష్ణవ, ప్రహ్లాద్ సింగ్ పాటిల్ తో పాటు ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, ఓ జడ్జీ లాంటి అనేకమంది ఫోన్లు ట్యాప్ అయ్యింది.

దివైర్ లో వచ్చిన కథనం సరిగ్గా పార్లమెంటు సమావేశాల మొదటిరోజే కావటంతో సమావేశాల్లో మంటలు రేగింది. రోజంతా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైనే ప్రతిపక్షాలు గోల గోల చేశాయి. సరే ప్రభుత్వం ఎలాగూ ఫోన్ ట్యాపింగ్ కథనం తప్పుల తడకగా కొట్టేసింది. ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయించటం లేదని ప్రకటించింది. అయినా ప్రతిపక్షాలు పట్టించుకోవటంలేదు.

ఎందుకంటే ఒకవైపు ఉభయసభల్లో ట్యాపింగ్ పై రచ్చ జరుగుతుంగగానే వాషింగ్టన్ పోస్టు కూడా ది వైర్ కథనాన్ని దృవీకరిస్తు మరో కథనాన్ని ఇవ్వటమే. నిజానికి ప్రభుత్వంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ఉన్నా ప్రతిపక్షాలపై నిఘా ఉంచటం కొత్తేమీకాదు. ప్రభుత్వాన్ని రక్షించుకోవటం కోసం అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్ధలు, ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే లక్ష్యంతో ఎవరెరవరు ఏమేమి చేస్తున్నారనే విషయంలో ప్రభుత్వం నిఘా ఉంచుతుందనటంలో సందేహం లేదు.

కాకపోతే నిఘా జాబితాలోని ప్రముఖుల పేర్లు లీకైనపుడు ఇలాంటి రచ్చలు జరుగుతుంటాయి. గతంలో రాజీవ్ గాంధి, మన్మోహన్ సింగ్ హయాంలో కూడా బీజేపీ ఇలాంటి రచ్చే చేసింది. అధికారంలో ఉన్నపార్టీకి ప్రతిపక్షాలకు ఇలాంటి వివాదాలు సాధారణమే. కాకపోతే ఇపుడు ప్రతిపక్షంలోని ప్రముఖులు, వైరాలజీ సైంటిస్టులు, జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల పేర్లు లీకవ్వటంతో సమస్య కాస్త పెద్దదిగా కనబడుతోందంతే. మరి ఇపుడు రేగిన దుమారం ఎప్పుడు చల్లారుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 20, 2021 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

1 hour ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

2 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

2 hours ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

2 hours ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

5 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

6 hours ago