Political News

రఘురామ విషయంలో మొబైలే కీలకమా ?

వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు బుక్కవటంలో మొబైల్ ఫోనే కీలకంగా మారిందా ? ఇదే అనుమానాలు పెరిగిపోతోంది. రఘురామ అరెస్టు నేపధ్యంలో ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ప్రకారం ప్రభుత్వంపై తిరుగుబాటు ఎంపి దుష్ప్రాచారం చేసేందుకు భారీఎత్తున డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఆయనపై వస్తున్న అనేక ఆరోపణలకు ఫోన్లో చాలా ఆధారాలున్నట్లు సమాచారం. ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడటం, బురదచల్లేసిన విషయం తెలసిందే.

ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఎంపి చేసిన ఆరోపణలు, విమర్శలు వరుసబెట్టి టీవీ 5, ఏబీఎన్+ఆంధ్రజ్యోతిలో చాలాకాలం ప్రసారమయ్యాయి. పై రెండు మీడియాల్లో అదేపనిగా ఎంపి కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే నేపధ్యంలో టీవీ 5 యాజమాన్యం నుండి ఎంపికి 10 లక్షల యూరోలు అంటే మన కరెన్సీలో సుమారు రు. 8.8 కోట్లు ముట్టినట్లు అఫిడవిట్లో ప్రభుత్వం ఆధారాలతో సహా చెప్పింది.

ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ కు ఆధారం ఏమిటంటే ఎంపి మొబైల్ ఫోనే. అందులో ఆర్ధిక లావాదేవీలతో పాటు ఎంపికి చంద్రబాబునాయుడు, లోకేష్+ జగన్ వ్యతిరేక మీడియా యాజమాన్యాలతో జరిపిన వాట్సప్, ఎస్ఎంఎస్ టెక్స్ట్ మెసేజులు కూడా దొరికినట్లు సమాచారం. ఈ ఫోన్ కోసమే తనను సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపి చేసిన ఫిర్యాదు అందరికీ గుర్తుండే ఉంటుంది. తన మొబైల్లో ఇంత కీలకమైన సమాచారం ఉంది కాబట్టే ఫోన్ పోలీసులకు ఇవ్వటానికి ఎంపి కూడా ఓ పట్టాన ఇష్టపడలేదు.

మొత్తానికి మొబైల్ ఫోన్లో దొరికిన ఆధారాల ప్రకారం ఎంపి సీఐడీకి దొరికినట్లే అని అర్ధమవుతోంది. అఫిడవిట్లో చెప్పినదే కాకుండా సీఐడీ దగ్గర ఇంకా చాలా కీలకమైన సమాచారమే ఉందని సమాచారం. అవసరమైనపుడు వాటన్నింటినీ సీఐడీ బయటపెట్టడానికి సమాచారాన్ని రెడీగా ఉంచుకుందట. ఎంపి ఫోన్లోని మొత్తం సమాచారాన్ని ప్రభుత్వం కోర్టుకు ఇస్తేకానీ అందులో ఉన్న సమాచారం ఏమిటనే విషయం బయటకుపొక్కే అవకాశం లేదు. మొత్తానికి ఎంపి ఫోనే ఆధారాలతో సహా పట్టించినట్లు అర్ధమవుతోంది. చూద్దాం తాజా అఫిడవిట్ తో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో.

This post was last modified on July 20, 2021 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago