లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమా ‘విక్రమ్’ మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నగరం, ఖైదీ, మాస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియోనే అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజల్ లాంటి మేటి నటులు నెగెటివ్ రోల్స్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చాక ఎగ్జైట్మెంట్ మరో స్థాయికి చేరింది.
కాగా ఇప్పుడు ‘విక్రమ్’ గురించి మరో ఆసక్తికర వార్త తమిళ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో కమల్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడట. ఐతే సినిమా మొత్తంలో ఆయన అంధుడిగా కనిపించడట. కొంత వరకు మాత్రమే ఆ షేడ్ ఉంటుందట. అలాగే ఆయన పోలీస్గానూ కనిపిస్తాడని అంటున్నారు.
కమల్ సినిమాలో అన్నింటికంటే హైలైట్ అయ్యేది ఆయన పెర్ఫామెన్సే. కొంచెం విలక్షణమైన పాత్ర పడిందంటే ఆయనెలా చెలరేగిపోతారో తెలిసిందే. అందులోనూ అంధుడి పాత్ర అంటే కమల్ ఎలా చేస్తాడనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. గతంలో ‘రాజా పార్వై’ (తెలుగులో అమావాస్య చంద్రుడు)లో ఆయన అంధుడిగా అద్భుత అభినయం చూపించాడు. మళ్లీ ఇంత కాలానికి అంధుడి పాత్ర చేస్తున్నాడు.. అది కూడా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
అంధుడి పాత్రలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజల్ లాంటి విలన్లను కమల్ ఎలా ఢీకొంటాడన్నదీ ఉత్కంఠ రేకెత్తంచే విషయమే. మరి తమిళ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ఎంత వరకు నిజమో చూడాలి. కొన్ని రోజుల కిందటే ‘విక్రమ్’ షూటింగ్ మొదలైంది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడంతో కమల్ చాలా ఎగ్జైట్ అవుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం తెలిసిందే.
This post was last modified on July 20, 2021 10:24 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…