విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇపుడు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఏపీలోని జగన్ ప్రభుత్వానిదేనని విపక్షాలు సహా అంతా అంటున్నారు. ఒక విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో నైతిక బాధ్యత ఏపీ సర్కార్ దే.
ఎందుకంటే విశాఖలో ఈ ప్లాంట్ కి అవసరం అయిన భూమిని వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. అలాగే విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చింది. ఈ నేపధ్యంలో కేంద్రం వాదన వేరేగా ఉంది. స్టీల్ ప్లాంట్ మీద యాజమాన్య హక్కులు అన్నీ మావేనని అంటోంది.
అదే విధంగా తాము ఏమైనా చేసుకుంటాం, అడిగేందుకు ఎవరికీ ఏ హక్కూ లేదన్నది వారి మాటగా ఉంది. ఇక ఏపీకి సంబంధించి ఏ చిన్న పని కూడా చేయడానికి కేంద్రం ఉత్సాహం చూపడంలేదు. అంతెందుకు దేశమంతా కేంద్ర మంత్రులు ఉన్నా ఏపీ నుంచి మాత్రం ఒక్కరు కూడా లేకుండా పోయారు.
మరి ఇది కూడా ఒక రకమైన రాజకీయ వివక్ష. ఏపీ నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఉంటే నేరుగా విశాఖ స్టీల్ లాంటి వాటి ఒత్తిడి ఆయన మీద పడేది. ఇపుడు ఆ విధంగా కూడా వైసీపీయే భరించాల్సి వస్తోంది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావించి గట్టిగా డిమాండ్ చేస్తామని కూడా చెబుతున్నారు.
అయితే కేంద్రం దీన్ని విని ఊరుకుంటే వైసీపీ ఎంపీలు ఏం ? చేయగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే కేంద్రం చాలా దూరం వచ్చేసింది. అదే టైమ్ లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఒక పాలసీగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గదు అన్నడానికి అచ్చమైన ఉదాహరణ సాగు చట్టాలే.
మరి ఉక్కు ప్రైవేటీకరణ వేటు నుంచి తప్పించుకోవడం అంటే అసాధ్యమే అని అంటున్నారు. ఈ విషయంలో మేము మా వంతు చేశామని వైసీపీ అనిపించుకోవడానికైతేనే పార్లమెంట్లో నాలుగు మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది తప్ప ఉక్కుని కాపాడేందుకు కాదన్న సెటైర్లు కూడా పడిపోతున్నాయి.
This post was last modified on July 14, 2021 10:11 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…