విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇపుడు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఏపీలోని జగన్ ప్రభుత్వానిదేనని విపక్షాలు సహా అంతా అంటున్నారు. ఒక విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో నైతిక బాధ్యత ఏపీ సర్కార్ దే.
ఎందుకంటే విశాఖలో ఈ ప్లాంట్ కి అవసరం అయిన భూమిని వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. అలాగే విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చింది. ఈ నేపధ్యంలో కేంద్రం వాదన వేరేగా ఉంది. స్టీల్ ప్లాంట్ మీద యాజమాన్య హక్కులు అన్నీ మావేనని అంటోంది.
అదే విధంగా తాము ఏమైనా చేసుకుంటాం, అడిగేందుకు ఎవరికీ ఏ హక్కూ లేదన్నది వారి మాటగా ఉంది. ఇక ఏపీకి సంబంధించి ఏ చిన్న పని కూడా చేయడానికి కేంద్రం ఉత్సాహం చూపడంలేదు. అంతెందుకు దేశమంతా కేంద్ర మంత్రులు ఉన్నా ఏపీ నుంచి మాత్రం ఒక్కరు కూడా లేకుండా పోయారు.
మరి ఇది కూడా ఒక రకమైన రాజకీయ వివక్ష. ఏపీ నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఉంటే నేరుగా విశాఖ స్టీల్ లాంటి వాటి ఒత్తిడి ఆయన మీద పడేది. ఇపుడు ఆ విధంగా కూడా వైసీపీయే భరించాల్సి వస్తోంది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావించి గట్టిగా డిమాండ్ చేస్తామని కూడా చెబుతున్నారు.
అయితే కేంద్రం దీన్ని విని ఊరుకుంటే వైసీపీ ఎంపీలు ఏం ? చేయగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే కేంద్రం చాలా దూరం వచ్చేసింది. అదే టైమ్ లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఒక పాలసీగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గదు అన్నడానికి అచ్చమైన ఉదాహరణ సాగు చట్టాలే.
మరి ఉక్కు ప్రైవేటీకరణ వేటు నుంచి తప్పించుకోవడం అంటే అసాధ్యమే అని అంటున్నారు. ఈ విషయంలో మేము మా వంతు చేశామని వైసీపీ అనిపించుకోవడానికైతేనే పార్లమెంట్లో నాలుగు మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది తప్ప ఉక్కుని కాపాడేందుకు కాదన్న సెటైర్లు కూడా పడిపోతున్నాయి.
This post was last modified on July 14, 2021 10:11 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…