సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే ఫేమస్ అయిపోయింది. ‘ఒరు అడార్ లవ్’ అనే సినిమాలో ఆమె కన్ను కొట్టే క్లిప్ కొన్నేళ్ల ముందు ఎలా వైరల్ అయిందో, కొన్ని రోజుల్లో ప్రియను ఎలా స్టార్ను చేసిందో తెలిసిందే. నిజానికి ఆ సినిమా చాలా పేలవంగా ఉంటుంది. థియేటర్లలో రిలీజైనపుడు డిజాస్టర్ అయింది.
ఐతేనేం ప్రియకు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ చిన్న సీన్ వల్ల ఎక్కడలేని ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె బోలెడన్ని సినిమాలు చేసింది. ఎన్నో యాడ్స్కు బ్రాండ్ అంబాసిడర్గానూ వ్యవహరించింది. తాజాగా ఆమె ఒక బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా మీడియాను కలవడానికి వచ్చింది. ఆ సందర్భంగా ప్రియకు ఎదురైన ఒక పిచ్చి ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
తాను ప్రమోట్ చేస్తున్న బ్రాండుకు తగ్గట్లే ఆమె కాషాయ రంగు డ్రెస్సులో ఈ ఈవెంట్కు హాజరైంది. ఐతే ఒక జర్నలిస్టు మాత్రం మీరీ కలర్లో డ్రెస్ ఎందుకు వేశారు.. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమైనా ఉన్నాయా అన్నట్లు ప్రశ్నించాడు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలర్ అని, ఆ పార్టీని ఇంప్రెస్ చేయడానికో, లేదంటే ఆ పార్టీ వాళ్ల ఒత్తిడితోనో ప్రియ కాషాయ రంగు డ్రెస్ వేసిందన్నది ఆ జర్నలిస్ట్ ఉద్దేశం. కానీ ప్రియ చాలా కూల్గా బ్రాండ్ ప్రమోషన్ కోసమే ఈ కలర్ డ్రెస్ వేశానని సమాధానం చెప్పి ఊరుకుంది.
కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఆ జర్నలిస్టు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిదానికీ రాజకీయ రంగు పులిమి ఇలా సెలబ్రెటీలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో ప్రతి పార్టీకీ ఒక రంగు ఉందని, అలాంటపుడు ఆయా రంగుల దుస్తులే ధరించకూడదా, అలా అంటే ఏ కలర్ మిగులుతుంది అన్న వాదన వినిపిస్తోంది. సెలబ్రెటీలు దొరికారు కదా అని, మైక్ ఉంది కదా అని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటూ సదరు జర్నలిస్టుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on August 7, 2026 9:18 am
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…