టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్లో డెల్టా వేరియెంట్ డేంజరస్గా మారింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. బయటపడింది.
బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్లోని తన సన్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడనుంది. దుర్హమ్లో కౌంటీ ఛాంపియన్ఫిప్-XI జట్టుతో తలపడనుంది.
ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో కరోనా వైరస్ బయటపడింది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ సమయంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారందరిలోనూ డెల్టా వేరియెంట్ కరోనానే బయటపడింది.
This post was last modified on July 15, 2021 10:45 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…