టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్లో డెల్టా వేరియెంట్ డేంజరస్గా మారింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. బయటపడింది.
బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్లోని తన సన్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడనుంది. దుర్హమ్లో కౌంటీ ఛాంపియన్ఫిప్-XI జట్టుతో తలపడనుంది.
ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో కరోనా వైరస్ బయటపడింది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ సమయంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారందరిలోనూ డెల్టా వేరియెంట్ కరోనానే బయటపడింది.
This post was last modified on July 15, 2021 10:45 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…