టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్లో డెల్టా వేరియెంట్ డేంజరస్గా మారింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. బయటపడింది.
బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్లోని తన సన్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడనుంది. దుర్హమ్లో కౌంటీ ఛాంపియన్ఫిప్-XI జట్టుతో తలపడనుంది.
ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో కరోనా వైరస్ బయటపడింది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ సమయంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారందరిలోనూ డెల్టా వేరియెంట్ కరోనానే బయటపడింది.
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…