తెలంగాణాలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన వ్యవహారమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత తెలంగాణాలో జనసేన పార్టీ నడిపే విషయంలో చేతులెత్తేసినట్లు అర్ధమైపోతోంది. అప్పటికేదో ఏపిలో పార్టీ పరిస్ధితి బ్రహ్మాండంగా ఉందని అనుకునేందుకు లేదు. కాకపోతే పార్టీ నిర్వహణ కష్టంగా ఉందని ఏపి విషయంలో ఇంకా ప్రకటించలేదంతే.
పార్టీ పెట్టినప్పటినుండి ఏ రోజు కూడా పవన్ సీరియస్ రాజకీయాలు చేసింది లేదు. ఎప్పుడో ఒకసారి జనాల్లో తిరగటం, మీడియాతో మాట్లాడటం మళ్ళీ కొద్ది రోజులు అడ్రస్ లేకుండా మాయమైపోవటం పవన్ కు బాగా అలవాటే. గట్టిగా నాలుగురోజులు జనాల్లో తిరిగితే చాలు మళ్ళీ నెలరోజుల దాకా కనబడని సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జనసేనను చాలా లైట్ గా తీసుకున్నారు.
పార్టీ వాళ్ళే లైట్ గా తీసుకున్నాక ఇక మామూలు జనాలు ఎందుకు పట్టించుకుంటారు. అందుకనే ఏకంగా రెండుచోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ణే జనాలు ఓడించారు. ఒక కాలు సినిమాల్లో మరోకాలు రాజకీయాల్లో పెట్టిన కారణంగానే ఏరోజు సీరియస్ కాదు. పైగా సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని జనాలు కూడా బాగానే అర్ధం చేసుకున్నారు.
తెలంగాణాలో పార్టీని జనాలు పట్టించుకోవటంలేదని గ్రహించినట్లున్నారు. అందుకనే వేల కోట్ల రూపాయలతో ముడిపడున్న ప్రస్తుత రాజకీయవ్యవస్ధలో పార్టీ నిర్మాణం తనకు కష్టంగా ఉందని చెప్పేసింది. తెలంగాణాలో అయినా ఏపీలో అయినా పార్టీ పరిస్ధితి ఒకేలాగుంది. మిత్రపక్షం బీజేపీ కూడా అవసరమైనపుడు తప్ప ఏపిలో జనసేనను అసలు పట్టించుకోవటమే లేదు. తెలంగాణాలో అయితే జనసేనను బీజేపీ ఓ పార్టీగానే గుర్తించటంలేదు. మొత్తానికి తెలంగాణాలో పార్టీని మూసేసే రోజు దగ్గరలోనే ఉందని అర్ధమైపోతోంది.
This post was last modified on July 9, 2021 11:23 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…