Political News

జెండా ఎత్తేయటమేనా ?

తెలంగాణాలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన వ్యవహారమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత తెలంగాణాలో జనసేన పార్టీ నడిపే విషయంలో చేతులెత్తేసినట్లు అర్ధమైపోతోంది. అప్పటికేదో ఏపిలో పార్టీ పరిస్ధితి బ్రహ్మాండంగా ఉందని అనుకునేందుకు లేదు. కాకపోతే పార్టీ నిర్వహణ కష్టంగా ఉందని ఏపి విషయంలో ఇంకా ప్రకటించలేదంతే.

పార్టీ పెట్టినప్పటినుండి ఏ రోజు కూడా పవన్ సీరియస్ రాజకీయాలు చేసింది లేదు. ఎప్పుడో ఒకసారి జనాల్లో తిరగటం, మీడియాతో మాట్లాడటం మళ్ళీ కొద్ది రోజులు అడ్రస్ లేకుండా మాయమైపోవటం పవన్ కు బాగా అలవాటే. గట్టిగా నాలుగురోజులు జనాల్లో తిరిగితే చాలు మళ్ళీ నెలరోజుల దాకా కనబడని సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జనసేనను చాలా లైట్ గా తీసుకున్నారు.

పార్టీ వాళ్ళే లైట్ గా తీసుకున్నాక ఇక మామూలు జనాలు ఎందుకు పట్టించుకుంటారు. అందుకనే ఏకంగా రెండుచోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ణే జనాలు ఓడించారు. ఒక కాలు సినిమాల్లో మరోకాలు రాజకీయాల్లో పెట్టిన కారణంగానే ఏరోజు సీరియస్ కాదు. పైగా సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని జనాలు కూడా బాగానే అర్ధం చేసుకున్నారు.

తెలంగాణాలో పార్టీని జనాలు పట్టించుకోవటంలేదని గ్రహించినట్లున్నారు. అందుకనే వేల కోట్ల రూపాయలతో ముడిపడున్న ప్రస్తుత రాజకీయవ్యవస్ధలో పార్టీ నిర్మాణం తనకు కష్టంగా ఉందని చెప్పేసింది. తెలంగాణాలో అయినా ఏపీలో అయినా పార్టీ పరిస్ధితి ఒకేలాగుంది. మిత్రపక్షం బీజేపీ కూడా అవసరమైనపుడు తప్ప ఏపిలో జనసేనను అసలు పట్టించుకోవటమే లేదు. తెలంగాణాలో అయితే జనసేనను బీజేపీ ఓ పార్టీగానే గుర్తించటంలేదు. మొత్తానికి తెలంగాణాలో పార్టీని మూసేసే రోజు దగ్గరలోనే ఉందని అర్ధమైపోతోంది.

This post was last modified on July 9, 2021 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

9 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

35 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago