Political News

ఇద్దరి మధ్య ఇరుక్కున్న మోడి

‘విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం’ అన్న సామెతలాగ తయారైపోయింది నరేంద్రమోడి పరిస్ధితి. బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో ముసలం పుట్టి పార్టీ చీలిక ఇప్పుడు మోడి మెడకు చుట్టుకుంది. తాజా రాజకీయ పరిణామాల్లో ఎల్జేపీ నిట్టనిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఎంపి, అధ్యక్షుడు, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకైనా చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి సొంత చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడయ్యారు.

పార్టీని నిలువుగా చీల్చేయటమే కాకుండా 6 మంది ఎంపిల్లో ఐదుమందిని పశుపతి తన దగ్గరకు లాగేసుకున్నారు. తమదే అసలైన ఎల్జేపీ అంటు లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. అలాగే తాజాగా పార్టీకి జాతీయ అధ్యక్షునిగా పశుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చూస్తుంటే చిరాగ్ ఒంటరైపోయ్యారని అర్ధమైపోతోంది. తండ్రి చనిపోయిన వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ ఒంటెత్తుపోకడలు పోయిన ఫలితంగా చివరకు తానే రోడ్డుమీద పడిపోయారు.

సరే బాబాయ్-అబ్బాయ్ బాగానే ఉన్నారు కానీ మధ్యలో మోడికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎలాగంటే ఒక వైపేమో పశుపతి నేతృత్వంలోని ఐదుగురు ఎంపిలు. ఇదే సమయంలో మరోవైపు తన చిరకాల మిత్రుడు పాశ్వాన్ కొడుకు చిరాగ్. న్యాయప్రకారమైతే మోడి ఐదుగురు ఎంపిల బలమున్న పశుపతికే మద్దతుగా నిలబడాలి. ధర్మాన్ని ఆచరించాలంటే చిరాగ్ కు అండగా నిలవాలి.

అయితే ప్రస్తుత రాజకీయాల్లో న్యాయం, ధర్మానికి పెద్దగా చోటు లేదన్న విషయం తెలుస్తునే ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నదంతా అవసరాలు, అవకాశాలు మాత్రమే. దీని ప్రకారమైతే ఐదుగురు ఎంపిలున్న పశుపతి వైపే మోడి మొగ్గుంటుందని తెలుస్తోంది. ఎందుకంటే మోడి గనుక చిరాగ్ వైపు మొగ్గుచూపితే లోక్ సభలో ఐదుగురు ఎంపిల బలం పోగొట్టుకున్నట్లవుతుంది.

అసలే దేశంలో బీజేపీ పరిస్దితి అంతంతమాత్రంగా ఉంది. మొన్ననే పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ చేతిలో చావుదెబ్బ తిన్నది. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోతున్నాయి. అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో ఐదుగురు ఎంపిల బలాన్ని పోగొట్టుకోవటానికి మోడి ఎంతమాత్రం సిద్ధంగా ఉందరని అర్ధమవుతోంది. మొత్తానికి బాబాయ్ తో పెట్టుకుని అబ్బాయ్ రోడ్డుమీద పడ్డారు.

This post was last modified on June 18, 2021 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago