రాజీవ్ గాంధీ మరణానంతరం గత మూడు దశాబ్దాల్లో మరే ప్రధానికీ రాని పాపులారిటీ నరేంద్ర మోడీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ప్రధాని కావడానికి ముందు, తర్వాత ఆయనకు లభించిన ఆదరణ అపూర్వం. ఒకప్పుడు మోడీ ఏం చెప్పినా, ఏం చేసినా ఆకర్షణీయంగానే ఉండేది. ఆయన మాటను భాజపా కార్యకర్తలే కాదు.. సామాన్యులు సైతం శ్రద్ధగా వినేవాళ్లు. ఆయనేం చెప్పినా నమ్మేవాళ్లు.
2014లో అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే.. ఆయన పెద్ద పెద్ద తప్పులు చేసినా కూడా జనాలు మన్నించారు. 2016లో జనాలను ఏమాత్రం సన్నద్ధం చేయకుండా డీమానిటైజేషన్ ప్రకటించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. దాని వల్ల సాధిస్తానన్న ఫలితాలేమీ సాధించకపోయినా, దేశం మీద అదనపు భారం మోసినా.. నల్లధనం తిరిగి తెస్తాన్న హామీని నిలబెట్టుకోకపోయినా.. అలాగే జీఎస్టీ పేరుతో కొత్త పన్ను విధానం తెచ్చి జనాలను బాదేసినా కూడా మన్నించారు. 2019లో మళ్లీ మంచి మెజారిటీ ఇచ్చిన మోడీని గద్దెనెక్కించారు.
ఐతే ఎల్లకాలం జనాల మూడ్ ఒకేలా ఉండదు. కొన్ని తప్పులు క్షమిస్తారేమో కానీ.. ఎల్లకాలం మన్నింపులుండవు. జనాల సహనానికి కూడా హద్దులుంటాయి. మోడీ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. కరోనా టైంలో కూడా పని చేయడం మానేసి, ఎప్పట్లాగే ఘనమైన కబుర్లతో కాలక్షేపం చేసిన ఆయన.. తీవ్రాతి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. గత ఏడాది కరోనా కొత్తలో మోడీ వైఫల్యాన్ని జనాలు మన్నించారు కానీ.. సెకండ్ వేవ్ టైంలో చేష్టలుడిగిన ప్రధాని విషయంలో జనాగ్రహం పతాక స్థాయికి చేరిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ పేరెత్తితే ఇప్పుడు సోషల్ మీడియా జనాలు మంటెత్తిపోతున్నారు. ఆయన గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే విరుచుకుపడుతున్నారు. ఆయన మంచి మాట చెప్పినా కూడా కౌంటర్లు తప్పట్లేదు.
నిన్న వ్యాక్సినేషన్ విషయమై జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నట్లు అప్డేట్ బయటికి రావడం ఆలస్యం.. ఆయనపై కౌంటర్లు మొదలైపోయాయి. ఇక వ్యాక్సినేషన్ ఫ్రీ అంటూ మంచి వార్తే చెప్పినా జనాల నుంచి సానుకూలాభిప్రాయం కనిపించలేదు. ఎఫ్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారా.. సుప్రీం కోర్టు అక్షింతలు వేస్తే కానీ బుద్ధి రాలేదా.. వ్యాక్సినేషన్ విషయంలో ఒక పాలసీ అంటూ ఉండదా.. ఇన్నాళ్లు ఏం చేశారు అంటూ ఆయన మీద ప్రశ్నల వర్షం కురిసింది. మోడీని విమర్శిస్తూ ఎన్ని మీమ్స్ పడ్డాయో, కార్టూన్లు వచ్చాయో లెక్కలేదు. ఇదంతా చూస్తే మోడీ గోల్డెన్ పీరియడ్ ముగిసిందని, కథ మొత్తం రివర్స్ అవుతోందని, ఇక ఆయనకు ఏదీ అంత తేలిక కాదని స్పష్టంగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…