భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అన్ని రాష్ట్రాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. ఆరేళ్ల కిందట మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. యువ ప్రేక్షకులను మైమరిపించేసింది. మలయాళంలో ఆ సమయానికి ఇది బిగ్గెస్ట్ హిట్. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ తెగ చూసేసి భారీ విజయాన్నందించారు. ఆ తర్వాత వేరే భాషల వాళ్లు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
‘ప్రేమమ్’కు సంబంధించి ఆర్టిస్టుల పరంగా అతి పెద్ద ఆకర్షణ అంటే.. సాయిపల్లవినే అనడంలో సందేహం లేదు. మలర్ పాత్రలో ఆమెను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్, నటనతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా మారింది. ఐతే ఇంతగా పేరు తెచ్చిన ఆ సినిమాలో నిజానికి సాయిపల్లవి నటించాల్సిందే కాదట.
‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మలర్ పాత్ర కోసం ముందు సాయిపల్లవిని అనుకోనే లేదని వెల్లడించాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పాత్రను రాసినట్లు అతను వెల్లడించాడు. ఐతే అసిన్ కెరీర్ అప్పటికే చరమాంకానికి వచ్చేసింది. ఆమె సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యే ఆలోచనలో ఉంది. అందువల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. దీంతో తర్వాత వేరే వాళ్ల వైపు చూశానని.. సాయిపల్లవి లాంటి ఫ్రెష్ ఫేస్ ఈ పాత్రకు బాగుంటుందని ఆమెను ఎంచుకున్నానని అల్ఫాన్సో వెల్లడించాడు.
అసిన్ మలర్ పాత్రను చేసి ఉంటే కచ్చితంగా ప్రేక్షకుల అనుభూతి మరోలా ఉండేది. ఆమె మంచి నటి, అందగత్తే అయినప్పటికీ ఒక ఫ్రెష్ ఫేస్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి డిఫరెంట్ లుక్స్, ఆమె నటన సినిమాకు ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. ఆమె లేని ‘ప్రేమమ్’ను ఊహించుకోవడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on June 8, 2021 9:42 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…