భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అన్ని రాష్ట్రాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. ఆరేళ్ల కిందట మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. యువ ప్రేక్షకులను మైమరిపించేసింది. మలయాళంలో ఆ సమయానికి ఇది బిగ్గెస్ట్ హిట్. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ తెగ చూసేసి భారీ విజయాన్నందించారు. ఆ తర్వాత వేరే భాషల వాళ్లు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
‘ప్రేమమ్’కు సంబంధించి ఆర్టిస్టుల పరంగా అతి పెద్ద ఆకర్షణ అంటే.. సాయిపల్లవినే అనడంలో సందేహం లేదు. మలర్ పాత్రలో ఆమెను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్, నటనతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా మారింది. ఐతే ఇంతగా పేరు తెచ్చిన ఆ సినిమాలో నిజానికి సాయిపల్లవి నటించాల్సిందే కాదట.
‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మలర్ పాత్ర కోసం ముందు సాయిపల్లవిని అనుకోనే లేదని వెల్లడించాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పాత్రను రాసినట్లు అతను వెల్లడించాడు. ఐతే అసిన్ కెరీర్ అప్పటికే చరమాంకానికి వచ్చేసింది. ఆమె సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యే ఆలోచనలో ఉంది. అందువల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. దీంతో తర్వాత వేరే వాళ్ల వైపు చూశానని.. సాయిపల్లవి లాంటి ఫ్రెష్ ఫేస్ ఈ పాత్రకు బాగుంటుందని ఆమెను ఎంచుకున్నానని అల్ఫాన్సో వెల్లడించాడు.
అసిన్ మలర్ పాత్రను చేసి ఉంటే కచ్చితంగా ప్రేక్షకుల అనుభూతి మరోలా ఉండేది. ఆమె మంచి నటి, అందగత్తే అయినప్పటికీ ఒక ఫ్రెష్ ఫేస్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి డిఫరెంట్ లుక్స్, ఆమె నటన సినిమాకు ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. ఆమె లేని ‘ప్రేమమ్’ను ఊహించుకోవడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on June 8, 2021 9:42 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…