భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అన్ని రాష్ట్రాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. ఆరేళ్ల కిందట మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. యువ ప్రేక్షకులను మైమరిపించేసింది. మలయాళంలో ఆ సమయానికి ఇది బిగ్గెస్ట్ హిట్. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ తెగ చూసేసి భారీ విజయాన్నందించారు. ఆ తర్వాత వేరే భాషల వాళ్లు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
‘ప్రేమమ్’కు సంబంధించి ఆర్టిస్టుల పరంగా అతి పెద్ద ఆకర్షణ అంటే.. సాయిపల్లవినే అనడంలో సందేహం లేదు. మలర్ పాత్రలో ఆమెను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్, నటనతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా మారింది. ఐతే ఇంతగా పేరు తెచ్చిన ఆ సినిమాలో నిజానికి సాయిపల్లవి నటించాల్సిందే కాదట.
‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మలర్ పాత్ర కోసం ముందు సాయిపల్లవిని అనుకోనే లేదని వెల్లడించాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పాత్రను రాసినట్లు అతను వెల్లడించాడు. ఐతే అసిన్ కెరీర్ అప్పటికే చరమాంకానికి వచ్చేసింది. ఆమె సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యే ఆలోచనలో ఉంది. అందువల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. దీంతో తర్వాత వేరే వాళ్ల వైపు చూశానని.. సాయిపల్లవి లాంటి ఫ్రెష్ ఫేస్ ఈ పాత్రకు బాగుంటుందని ఆమెను ఎంచుకున్నానని అల్ఫాన్సో వెల్లడించాడు.
అసిన్ మలర్ పాత్రను చేసి ఉంటే కచ్చితంగా ప్రేక్షకుల అనుభూతి మరోలా ఉండేది. ఆమె మంచి నటి, అందగత్తే అయినప్పటికీ ఒక ఫ్రెష్ ఫేస్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి డిఫరెంట్ లుక్స్, ఆమె నటన సినిమాకు ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. ఆమె లేని ‘ప్రేమమ్’ను ఊహించుకోవడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on June 8, 2021 9:42 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…