కరోనా కల్లోలం గత కొద్దికాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇంటా బయట విమర్శల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని డీల్ చేయడం, ఈ సమయంలో ప్రజల సంక్షేమం విషయంలో ఆయన గ్రాఫ్ పడిపోయిందనే విశ్లేషణలు కూడా తెగ వచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టారని అంటున్నారు. కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.122 తగ్గింది. ప్రతి ఏటా ఉంటే సంప్రదాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చమురు కంపెనీలు ఎల్పీజీ రేట్లను ఇకపై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయన్న వార్తల నేపథ్యంలో తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు లేదు. ప్రధాని మోడీ పాలనలో గత ఏడేళ్లలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండగా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణయం ఉపశమనం కలిగించేదని పలువరు పేర్కొంటున్నారు.
దాదాపు గత ఏడాది అంతా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంనది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగడంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంనది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుదలపై భారీగా విమర్శలు వచ్చిన తరుణంలో ఈ మేరకు తగ్గించే నిర్ణయం తీసుకునేలా కేంద్రం చొరవ చూపిందని అంటున్నారు.
This post was last modified on June 3, 2021 6:58 am
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…