కరోనా కల్లోలం గత కొద్దికాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇంటా బయట విమర్శల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని డీల్ చేయడం, ఈ సమయంలో ప్రజల సంక్షేమం విషయంలో ఆయన గ్రాఫ్ పడిపోయిందనే విశ్లేషణలు కూడా తెగ వచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టారని అంటున్నారు. కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.122 తగ్గింది. ప్రతి ఏటా ఉంటే సంప్రదాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చమురు కంపెనీలు ఎల్పీజీ రేట్లను ఇకపై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయన్న వార్తల నేపథ్యంలో తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు లేదు. ప్రధాని మోడీ పాలనలో గత ఏడేళ్లలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండగా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణయం ఉపశమనం కలిగించేదని పలువరు పేర్కొంటున్నారు.
దాదాపు గత ఏడాది అంతా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంనది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగడంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంనది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుదలపై భారీగా విమర్శలు వచ్చిన తరుణంలో ఈ మేరకు తగ్గించే నిర్ణయం తీసుకునేలా కేంద్రం చొరవ చూపిందని అంటున్నారు.
This post was last modified on June 3, 2021 6:58 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…