Political News

డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిన మోడీ

క‌రోనా క‌ల్లోలం గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారిని డీల్ చేయ‌డం, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు కూడా తెగ వ‌చ్చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర రూ.122 తగ్గింది. ప్ర‌తి ఏటా ఉంటే సంప్ర‌దాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

చమురు కంపెనీలు ఎల్‌పీజీ రేట్లను ఇక‌పై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో తొలి రోజునే ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త వ‌చ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌పై రూ.122 త‌గ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండ‌ర్‌ ధరలో మార్పు లేదు. ప్ర‌ధాని మోడీ పాల‌న‌లో గత ఏడేళ్ల‌లో 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధ‌ర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండ‌గా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణ‌యం ఉప‌శ‌మ‌నం క‌లిగించేద‌ని ప‌లువ‌రు పేర్కొంటున్నారు.

దాదాపు గ‌త ఏడాది అంతా సిలిండ‌ర్ ధ‌ర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంన‌ది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్‌కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్‌కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగ‌డంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంన‌ది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుద‌ల‌పై భారీగా విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌రుణంలో ఈ మేర‌కు త‌గ్గించే నిర్ణ‌యం తీసుకునేలా కేంద్రం చొర‌వ చూపింద‌ని అంటున్నారు.

This post was last modified on June 3, 2021 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

53 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

2 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

3 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago