Political News

డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిన మోడీ

క‌రోనా క‌ల్లోలం గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారిని డీల్ చేయ‌డం, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు కూడా తెగ వ‌చ్చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర రూ.122 తగ్గింది. ప్ర‌తి ఏటా ఉంటే సంప్ర‌దాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

చమురు కంపెనీలు ఎల్‌పీజీ రేట్లను ఇక‌పై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో తొలి రోజునే ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త వ‌చ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌పై రూ.122 త‌గ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండ‌ర్‌ ధరలో మార్పు లేదు. ప్ర‌ధాని మోడీ పాల‌న‌లో గత ఏడేళ్ల‌లో 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధ‌ర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండ‌గా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణ‌యం ఉప‌శ‌మ‌నం క‌లిగించేద‌ని ప‌లువ‌రు పేర్కొంటున్నారు.

దాదాపు గ‌త ఏడాది అంతా సిలిండ‌ర్ ధ‌ర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంన‌ది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్‌కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్‌కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగ‌డంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంన‌ది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుద‌ల‌పై భారీగా విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌రుణంలో ఈ మేర‌కు త‌గ్గించే నిర్ణ‌యం తీసుకునేలా కేంద్రం చొర‌వ చూపింద‌ని అంటున్నారు.

This post was last modified on June 3, 2021 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

51 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago