Political News

డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిన మోడీ

క‌రోనా క‌ల్లోలం గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారిని డీల్ చేయ‌డం, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు కూడా తెగ వ‌చ్చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర రూ.122 తగ్గింది. ప్ర‌తి ఏటా ఉంటే సంప్ర‌దాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

చమురు కంపెనీలు ఎల్‌పీజీ రేట్లను ఇక‌పై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో తొలి రోజునే ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త వ‌చ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌పై రూ.122 త‌గ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండ‌ర్‌ ధరలో మార్పు లేదు. ప్ర‌ధాని మోడీ పాల‌న‌లో గత ఏడేళ్ల‌లో 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధ‌ర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండ‌గా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణ‌యం ఉప‌శ‌మ‌నం క‌లిగించేద‌ని ప‌లువ‌రు పేర్కొంటున్నారు.

దాదాపు గ‌త ఏడాది అంతా సిలిండ‌ర్ ధ‌ర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల‌ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంన‌ది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్‌కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్‌కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగ‌డంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంన‌ది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుద‌ల‌పై భారీగా విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌రుణంలో ఈ మేర‌కు త‌గ్గించే నిర్ణ‌యం తీసుకునేలా కేంద్రం చొర‌వ చూపింద‌ని అంటున్నారు.

This post was last modified on June 3, 2021 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

14 minutes ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

1 hour ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

2 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago