తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడాది కిందట్నుంచి తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాలో బాగా హైలైట్ అవుతూ వచ్చారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. రెబల్గా మారినప్పటికీ.. ఆయన ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయనపై క్రమశిక్షణ చర్యల్లాంటివేమీ చేపట్టలేదు. అనర్హత వేటూ పడలేదు. ఇప్పటికీ ఆయన వైకాపా నాయకుడే.
సాంకేతికంగా వైకాపా ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు కోసం ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్కు శ్రీకారం చుట్టడం విశేషం. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద రఘురామ మీద కేసులు పెట్టిన ఏపీ సీఐడీ పోలీసులు.. ఆయన్ని శుక్రవారం ఆరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా తమ కస్టడీలో రఘురామను పోలీసులు కొట్టినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు రఘురామ గాయాలతో ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.
రఘురామ తమ పార్టీ నాయకుడు కాకపోయినప్పటికీ.. తమను మించి జగన్ మీద పోరాడుతుండటంతో ఆయన్ని టీడీపీ ఓన్ చేసుకుంటోంది. స్వయంగా టీడీపీ అధినేత రఘురామ అరెస్టును, ఆయనపై దాడిని ఖండిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అలాగే #WesupportRRR #WestandwithRRR అంటూ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించడం విశేషం. ఆయన ఇలా ట్వీట్ వేయగానే.. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, పార్టీ మద్దతుదారులతో పాటు రఘురామ సపోర్టర్స్ కూడా ట్రెండ్ను అందిపుచ్చుకున్నారు. ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చూస్తుంటే రఘురామ అరెస్టు, ఆయనపై దాడి జగన్ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టేలాగే ఉంది.
This post was last modified on May 16, 2021 9:47 am
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…