Political News

మోడీతో జ‌గ‌న్ పోటీ ప‌డుతున్నారా.. నెటిజ‌న్ల కామెంట్లు…!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. పోటీ ప‌డుతున్నారా ? క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బంది పడుతుంటే.. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాని మోడీ.. పెద్ద‌గా నిధులు కేటాయించ‌డం లేదు. నిజానికి బ‌డ్జెట్ కేటాయింపుల్లో.. రు. 35 వేల కోట్లు క‌రోనా వ్యాక్సిన్‌కు మోడీ స‌ర్కారు కేటాయించింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిలో నుంచి రు. 4500 కోట్లు మాత్ర‌మే ఆయ‌న కేటాయించారు. అది కూడా రెండు కంపెనీలు వ్యాక్సిన్ త‌యారీకి ఆయ‌న వీటిని కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక‌, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు బీమా ఉంటుంద‌ని చెప్పినా.. ఈ విష‌యంలోనూ కేవ‌లం వైద్యుల‌ను మాత్ర‌మే చేర్చి.. త‌ప్పుకొన్నారు.

ఇక‌, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు అల్లాడుతుంటే.. మ‌రోవైపు.. రైతుల‌కు ఫ‌స‌ల్ బీమా యోజ‌న కింద‌.. 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి రు. 19 వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌కు ఈ నిదులు ఇవ్వొచ్చు క‌దా ? అనే కామెంట్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నెటిజ‌న్లు అంటున్నారు. వ్యాక్సిన్ కొనేందుకు రు. 1600 కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధులు లేవ‌ని.. మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, తాజాగా జ‌గ‌న్ కూడా రైతుల‌కు వైఎస్సార్ రైతు భ‌రోసా కింది నిధులు విడుద‌ల చేశారు.

మ‌రోవైపు.. వ్యాక్సిన్ బాధ్య‌త కేంద్రానిదేన‌ని అంటున్నారు. దీంతో ఈ డ‌బ్బులేవో.. వ్యాక్సిన్‌కు కేటాయించి.. కొనుగోలు చేయొచ్చు క‌దా.. ప్ర‌జ‌లు ప్రాణాల‌తో ఉంటేనే క‌దా.. జ‌గ‌న్ ఏ ప‌థ‌కం ప్ర‌క‌టించి.. అమ‌లు చేసినా.. ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేత‌ప్ప‌.. ప్ర‌జ‌లు రోగాల‌తోను, క‌రోనా విల‌యంలోనూ అల్లాడుతుంటే.. ఏంటి ప్ర‌యోజ‌నం అంటున్నారు. గ‌తేడాది లాక్‌డౌన్‌లో మోడీ ప‌దే ప‌దే ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ధైర్యం నింపారు. ఈ యేడాది మోడీ ఆ విష‌యంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు.

ఇక్క‌డ జ‌గ‌న్ కూడా బ‌య‌టకు రావ‌డం లేదు స‌రిక‌దా ? క‌నీసం ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ? ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ఈ క‌రోనా విష‌యంలో మోడీలాగానే చేతులు ఎత్తేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఎక్కువుగా ఎదుర్కొంటున్నారు.

This post was last modified on May 16, 2021 6:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

48 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

50 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago