Political News

బయటపడిన మోడి డబల్ గేమ్

ఒకవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు రాష్ట్రాలకు అందటంలేదు. రాష్ట్రాలకు అవసరమైన టీకాల ఉత్పత్తిని పెంచటం సాధ్యం కాదని టీకాలు ఉత్పత్తిచేస్తున్న రెండు ఫార్మాకంపెనీలు చేతులెత్తేశాయి. ముందు 60 ఏళ్ళ వాళ్ళకి టీకాలన్నారు. తర్వాత 45 ఏళ్ళ వాళ్ళకి కూడా టీకాలు వేయాలన్నారు. ఎప్పుడైతే టీకాలు వేసే వయసును 60 నుండి 45కి తగ్గించారో అప్పటి నుండే టీకాల కొరత మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా టీకాలు వేయొచ్చని కేంద్రం చెప్పి చేతులు దులిపేసుకుంది.

వాస్తవాలు ఇలాగుంటే ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన నరేంద్రమోడి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా టీకాలు వేయటంలో వేగం తగ్గించద్దని ఆదేశించటమే విచిత్రంగా ఉంది. దేశావసరాలకు సరిపడా టీకాలను ఉత్పత్తి చేయలేమని టీకాలు ఉత్పత్తి చేస్తున్న రెండు ఫార్మా కంపెనీలు చేతులెత్తేశాయి. మొత్తం టీకాల పంపిణిని కేంద్రం తన గుప్పిట్లోనే పెట్టుకున్నది. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను రాష్ట్రాల నుండి ఇండెంట్లు తెప్పించుకుని కేంద్రమే ఫార్మాకంపెనీలతో మాట్లాడి సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇలాంటి నేపధ్యంలోనే టీకాల కొరత గొడవ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అవసరమైన టీకాలను ఫార్మాకంపెనీలతో మాట్లాడుకోవాలని రాష్ట్రప్రభుత్వాలకు చెప్పిన కేంద్రం చేతులు దులిపేసుకుంది. ఫార్మాకంపెనీలతో రాష్ట్రప్రభుత్వాలు మాట్లాడినపుడు కేంద్రం ఇదివరకు పెట్టిన ఇండింటునే సరఫరా చేయలేకపోతున్నట్లు చెప్పాయి. కాబట్టి రాష్ట్రావసరాలకు సరిపడా టీకాలను అందించలేమని స్పష్టంగా చెప్పేశాయి. ఈ పరిస్ధితుల్లో 18 ఏళ్ళవాళ్ళకి టీకాలు వేయటాన్ని ప్రభుత్వాలు పక్కనపెట్టేశాయి.

ఈ విషయాలన్నీ నరేంద్రమోడికి బాగా తెలుసు. 45 ఏళ్ళు దాటినవారిలో 31 శాతం మందికి మాత్రమే టీకాలు వేయగలిగాయి. అంటే వ్యాక్సిన్ కొరత ఏ స్ధాయిలో ఉందో దీన్నిబట్టి అర్ధమైపోతోంది. ఇలాంటిస్ధితిలో అందరికీ టీకాలు వేయాలని మోడి రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించటంలో అర్ధమేలేదు. అందరికీ టీకాల కార్యక్రమం విఫలమయ్యిందటేనే అందుకు కారణం నరేంద్రమోడి. తన వైఫల్యాన్ని అంగీకరించటానికి ఇష్టపడని మోడి దాన్ని రాష్ట్రప్రభుత్వాల మీదకు తోసేస్తున్నారు. ఇక్కడే మోడి డబల్ గేమ్ జనాలకు అర్ధమైపోతోంది.

This post was last modified on May 7, 2021 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

23 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

30 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago