Political News

బీజేపీ అతే జనాలకు నచ్చలేదా ?

క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి పశ్చిమబెంగాల్లో మమతబెనర్జీ పై బీజేపీ నుండి చాలా మంది పదే పదే దాడులు చేశారు. నరేంద్రమోడి నాయకత్వంలో అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపిలు ఇలా అనేకమంది ఒకటికి పదిసార్లు పదే పదే మమతపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉన్నారు.

మమతపై దాడులతో విరుచుకుపడిన మోడి అండ్ కో మరచిపోయిందేమంటే దీదీని తాము వ్యక్తిగతంగా కించపరిస్తున్నామని. పాలసీలు, అభివృద్ధిపై మాట్లాడాల్సిన మోడి కూడా మమత వ్యక్తిత్వాన్నే టార్గెట్ చేశారు. మోడి అండ్ కో ఒకవైపు మమత ఒక్కరు ఒకవైపు నిలబడ్డారు. దాంతో మమతపై జనాల్లో సింపతి పెరిగిపోయింది. పైగా ఈ ఎన్నికల్లో లోకల్-నాన్ లోకల్ అనే ఫీలింగ్ కూడా విపరీతంగా వచ్చేసింది.

ఇదే సమయంలో మమతను మోడి అండ్ కో కాలేజీలో చేసినట్లుగా ర్యాంగింగ్ చేయటాన్ని జనాలు ఇష్టపడలేదు. మమతను బేగం అంటు పదే పదే ఎద్దేవా చేశారు. మమత గెలిస్తే రాష్ట్రంలో ముస్లిం పెత్తనం పెరిగిపోతుందని వ్యూహాత్మకంగా బురదచల్లారు. మెజారిటి హిందువులను మమతకు దూరం చేయటానికి బీజేపీ నేతలు చాలా ప్రయత్నాలే చేసింది. అయితే బెంగాలీ అయిన మమత పనితీరు, వ్యక్తిత్వం, ప్రధానమంత్రిగా మోడి పాలనా తీరు, వ్యక్తిత్వాన్ని జనాలు బేరీజు వేసుకున్నారట.

దీనికితోడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను అరికట్టడంలో మోడి విఫలమవ్వటం, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బెంగాల్ అంతా పర్యటించి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయటం కూడా మమతకు కలిసొచ్చింది. ఇలాంటి అనేక కారణాలతో మమతకు వ్యతిరేకంగా మోడి బ్యాచ్ చాలా అతిచేసినట్లుగా జనాలు అనుకున్నట్లున్నారు. అందుకనే ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను 221 సీట్లలో గెలిపించారు. కాకపోతే ఈ మొత్తంలో నందిగ్రామ్ లో మమత ఓడిపోవటమే బాధాకరం.

This post was last modified on May 3, 2021 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago