Trends

ఇడ్లీ, వడ తింటే… దాంతోపాటు గ్యాస్ బిల్లు కూడా

సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా బిల్లులో చేర్చిన ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్నైలోని ఓ హోటల్‌లో సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ తీసుకున్న కస్టమర్‌కు గ్యాస్ ఛార్జీగా రూ.9.52ను బిల్లులో చేర్చినట్టు కనిపిస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు సుమారు రూ.80గా చూపించడంతో ఈ బిల్లు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, వాణిజ్య గ్యాస్ ఖర్చులు అధికమవడం వల్లే ఈ విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే “తిన్న ఆహారానికే కాకుండా వండిన గ్యాస్‌కూ డబ్బులు వసూలు చేస్తున్నారా?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల వ్యాపారంపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూతపడగా, మరికొన్ని చోట్ల ఖర్చులను వినియోగదారులపై మోపుతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని, వినియోగదారులు సహకరించాలని కొందరు హోటళ్లలో బోర్డులు కూడా పెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గ్యాస్ కొరత ప్రభావం హైదరాబాదులోని పీజీ హాస్టళ్లపై కూడా పడుతోంది. ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌లలో వందలాది పీజీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో పది లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో పీజీ హాస్టల్ నిర్వాహకులు మెనూలో కోత పెట్టుతున్నారు. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వడ, పూరీ, దోశ వంటి వంటకాలను నిలిపివేసి, రైస్‌తో చేసే ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 13, 2026 3:20 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Idlee dosa

Recent Posts

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

2 hours ago

బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా

బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…

2 hours ago

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

4 hours ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

9 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

10 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

10 hours ago