సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా బిల్లులో చేర్చిన ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్నైలోని ఓ హోటల్లో సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ తీసుకున్న కస్టమర్కు గ్యాస్ ఛార్జీగా రూ.9.52ను బిల్లులో చేర్చినట్టు కనిపిస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు సుమారు రూ.80గా చూపించడంతో ఈ బిల్లు నెట్టింట వైరల్గా మారింది.
ఇటీవల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, వాణిజ్య గ్యాస్ ఖర్చులు అధికమవడం వల్లే ఈ విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే “తిన్న ఆహారానికే కాకుండా వండిన గ్యాస్కూ డబ్బులు వసూలు చేస్తున్నారా?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల వ్యాపారంపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూతపడగా, మరికొన్ని చోట్ల ఖర్చులను వినియోగదారులపై మోపుతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని, వినియోగదారులు సహకరించాలని కొందరు హోటళ్లలో బోర్డులు కూడా పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గ్యాస్ కొరత ప్రభావం హైదరాబాదులోని పీజీ హాస్టళ్లపై కూడా పడుతోంది. ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లలో వందలాది పీజీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో పది లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో పీజీ హాస్టల్ నిర్వాహకులు మెనూలో కోత పెట్టుతున్నారు. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వడ, పూరీ, దోశ వంటి వంటకాలను నిలిపివేసి, రైస్తో చేసే ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 13, 2026 3:20 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…