పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు.
స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో, ఈ రోజు ఈ కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం బాధాకరం అన్నారు.
ముఖ్యమంత్రి ఫొటో కూడా తీసివేయడం చాలా దారుణంగా ఉన్న పరిస్థితికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తాను ఆవేశాన్ని అణుచుకున్నా కానీ.. కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. 15 ఏళ్లు కలిసి ఉండాల్సిన ప్రభుత్వానికి అధికారులు ముందుగా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా నాయకుడికి గౌరవం ఇవ్వకపోతే మేం ఎలా ఉండగలం అని ప్రశ్నించారు. ఏ పార్టీని అగౌరవ పరిచినా మిగిలిన రెండు పార్టీలు తప్పు పట్టాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు వర్మ.
This post was last modified on March 13, 2026 4:52 pm
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…
సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…