పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు.
స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో, ఈ రోజు ఈ కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం బాధాకరం అన్నారు.
ముఖ్యమంత్రి ఫొటో కూడా తీసివేయడం చాలా దారుణంగా ఉన్న పరిస్థితికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తాను ఆవేశాన్ని అణుచుకున్నా కానీ.. కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. 15 ఏళ్లు కలిసి ఉండాల్సిన ప్రభుత్వానికి అధికారులు ముందుగా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా నాయకుడికి గౌరవం ఇవ్వకపోతే మేం ఎలా ఉండగలం అని ప్రశ్నించారు. ఏ పార్టీని అగౌరవ పరిచినా మిగిలిన రెండు పార్టీలు తప్పు పట్టాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు వర్మ.
This post was last modified on March 13, 2026 4:52 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…