పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు.
స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో, ఈ రోజు ఈ కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం బాధాకరం అన్నారు.
ముఖ్యమంత్రి ఫొటో కూడా తీసివేయడం చాలా దారుణంగా ఉన్న పరిస్థితికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తాను ఆవేశాన్ని అణుచుకున్నా కానీ.. కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. 15 ఏళ్లు కలిసి ఉండాల్సిన ప్రభుత్వానికి అధికారులు ముందుగా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా నాయకుడికి గౌరవం ఇవ్వకపోతే మేం ఎలా ఉండగలం అని ప్రశ్నించారు. ఏ పార్టీని అగౌరవ పరిచినా మిగిలిన రెండు పార్టీలు తప్పు పట్టాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు వర్మ.
This post was last modified on March 13, 2026 4:52 pm
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…