పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు.
స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో, ఈ రోజు ఈ కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం బాధాకరం అన్నారు.
ముఖ్యమంత్రి ఫొటో కూడా తీసివేయడం చాలా దారుణంగా ఉన్న పరిస్థితికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తాను ఆవేశాన్ని అణుచుకున్నా కానీ.. కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. 15 ఏళ్లు కలిసి ఉండాల్సిన ప్రభుత్వానికి అధికారులు ముందుగా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా నాయకుడికి గౌరవం ఇవ్వకపోతే మేం ఎలా ఉండగలం అని ప్రశ్నించారు. ఏ పార్టీని అగౌరవ పరిచినా మిగిలిన రెండు పార్టీలు తప్పు పట్టాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు వర్మ.
This post was last modified on March 13, 2026 4:52 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…