స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. గత రెండేళ్లలో చాలాసార్లు ఇలా అదుపు తప్పి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆయన ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.
తాజాగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు చేసిన జానపద చిత్రాలు చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ అసభ్య పదజాలంతో ఒక వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా.. సోషల్ మీడియా కాలం కావడంతో తమిళ జనాలకు విషయం చేరింది.
వాళ్ళు ఎంజీఆర్ ను దేవుడిలాగే చూస్తారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. తెలుగు వాడే అయిన తమిళ హీరో విశాల్.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు.
ఎంజీఆర్ తమిళ సినిమాకు దేవుడు అంటూ మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ జనాలు ఆయన్ని ఎలా చూస్తారో తనకు తెలుసన్నారు. ఎంజీఆర్ మీద తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. తనకు కాంతారావు అవార్డ్ ఇచ్చిన సందర్భంగా ఆయన గొప్పదనం గురించి చెప్పే క్రమంలో కొంచెం మిస్ అయి ఎంజీఆర్ గురించి ఒక మాట అనేసినట్లు చెప్పారు. దాన్ని కొందరు కావాలనే వివాదాస్పదం చేశారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తమ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి తమ పెర్ఫార్మెన్స్ చూశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి తాను తప్పు మాట్లాడేంత సాహసం చేస్తానా అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
ఈసారికి పొరపాటు అయిందని.. ఎవరి మనసులనైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెప్తున్నానని. ఇకపై తాను ఎప్పుడూ ఇలా మాట్లాడనని.. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ వీడియో మొత్తం ఆయన తమిళంలోనే మాట్లాడి నేరుగా తమిళులకు సారీ చెప్పారు.
This post was last modified on March 13, 2026 3:47 pm
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…
రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ…
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…