కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో కోణంలో కాస్త ఆలోచించి చూసినప్పుడు.. ముందు అనుకున్నదానిలో దొర్లిన లోపాలు ఇ్టే అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి పనే చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.
ఒక విషయానికి సంబంధించి సానుకూల అంశాలతోపటు ప్రతికూల అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ప్రస్తావించి.. హెచ్చరించిన వైనం చూసిప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన మాట అక్షర సత్యం కదా అని అనుకోకుండా ఉండలేం. మహిళా ఉద్యోగులకు నెలసరి వేళ.. వారికి సెలవులు ఇచ్చే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
దీనికి సంబంధించిన చట్టాన్ని చేపట్టి.. అందుకు తగ్గ నియమాలను రాష్ట్రాలకు ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న సుప్రీం.. ‘మనం అలాంటి నిబంధనల్ని తీసుకొస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవు. అలా చేస్తే.. మహిళలు నష్టపోతారు’ అని పేర్కొన్నారు.
ఇలాంటి చట్టాలతో తాము పురుషుల కంటే తక్కువనే భయం ఉద్యోగాలు చేసే మహిళల్లో క్రియేట్ చేసే అవకాశం ఉందన్న సుప్రీంకోర్టు.. రుతుక్రమం మీద అవగాహన కల్పించటం వేరని.. దానిని సన్సేషన్ చేయటం వేరుగా పేర్కొంది. ఆ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత నుంచి మహిళల్ని ఎవరూ నియమించుకోరని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షంషద్ తన వాదనలు వినిపిస్తూ 2013లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే విధంగా ప్రైవేటు కంపెనీలు అలాంటి వెసులుబాటును కల్పిచాలని కోరారు.
అలా చేయటం ద్వారా.. కంపెనీలు మహిళల్ని ఎవరూ నియమించుకోరన్న సుప్రీంకోర్టు.. ‘‘మీకు సంస్థల యజామాన్యాల మనస్తత్వం గురించి తెలియదు. ఈ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన మరుక్షణం వారిని ఎవరూ నియమించుకోరు’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారి కెరీర్ ఇట్టే ముగిసిపోతుంది’ అని స్పష్టం చేశారు.
ఇలాంటివాటిని తప్పనిసరి చేస్తే.. వారికి ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారిభవిష్యత్తుకు అడ్డంకిగా మారతాయన్నది మర్చిపోకూడదని పేర్కొనటం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే.. నిజమే కదా? అనుకోకుండా ఉండలేం.
This post was last modified on March 13, 2026 6:01 pm
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…
సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…