Political News

రూ.7వేలు ఉండే దుబాయ్ టికెట్ రూ.40వేలు ఎందుకైంది?

హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి.

తాజాగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో భారత విమానాలపై దుబాయ్ నిషేధాన్ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ బ్యాన్ అమలు కానుంది. దీంతో.. శనివారం వరకు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. ఏడాదిగా నడుస్తున్న కరోనా రచ్చతో దుబాయ్ లో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.

కేసుల తీవ్రత తగ్గినప్పటి నుంచి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. అది.. ఈ మధ్యన మరింత పెరిగాయి. అంతలోనే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటంతో.. కాస్త జోరు తగ్గిన తర్వాత దుబాయ్ కు వెళదామని భావించారు. కానీ.. దుబాయ్ సర్కారు భారత్ నుంచి వచ్చే వారి విషయంలో తీవ్ర ఆంక్షల్ని విధించింది. భారత్ నుంచి వచ్చిన వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆదివారం నుంచి భారత్ నుంచి దుబాయ్ కు ఫ్లైట్లను అనుమతించకూడదని నిర్ణయించింది.

దీంతో.. సెలవుల మీద దేశానికి వచ్చిన వారిలో కొత్త గుబులు మొదలైంది. ప్రస్తుతానికి పది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించిన దుబాయ్.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. నిషేధం మరింతకాలం కొనసాగించే వీలుందన్న సందేహాలు ఎక్కువ అయ్యాయి. అంతకాలం ఇండియాలోనే ఉండిపోతే.. ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో.. ఎవరికి వారు ఎంత ధర అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు తహతహలాడారు. దీంతో.. రూ.7వేలు ఉండాల్సిన ఫ్లైట్ టికెట్ ఏకంగా రూ.40వేలకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దుబాయ్ లో వైద్య సేవలకు వెళ్లే వారు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి వారిలో ఐదారుగురు కలిసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లటం.. అక్కడి నుంచి తిరిగి రావటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.

This post was last modified on April 25, 2021 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

2 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

2 hours ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

3 hours ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

3 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

3 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

4 hours ago