హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి.
తాజాగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో భారత విమానాలపై దుబాయ్ నిషేధాన్ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ బ్యాన్ అమలు కానుంది. దీంతో.. శనివారం వరకు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. ఏడాదిగా నడుస్తున్న కరోనా రచ్చతో దుబాయ్ లో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.
కేసుల తీవ్రత తగ్గినప్పటి నుంచి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. అది.. ఈ మధ్యన మరింత పెరిగాయి. అంతలోనే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటంతో.. కాస్త జోరు తగ్గిన తర్వాత దుబాయ్ కు వెళదామని భావించారు. కానీ.. దుబాయ్ సర్కారు భారత్ నుంచి వచ్చే వారి విషయంలో తీవ్ర ఆంక్షల్ని విధించింది. భారత్ నుంచి వచ్చిన వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆదివారం నుంచి భారత్ నుంచి దుబాయ్ కు ఫ్లైట్లను అనుమతించకూడదని నిర్ణయించింది.
దీంతో.. సెలవుల మీద దేశానికి వచ్చిన వారిలో కొత్త గుబులు మొదలైంది. ప్రస్తుతానికి పది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించిన దుబాయ్.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. నిషేధం మరింతకాలం కొనసాగించే వీలుందన్న సందేహాలు ఎక్కువ అయ్యాయి. అంతకాలం ఇండియాలోనే ఉండిపోతే.. ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో.. ఎవరికి వారు ఎంత ధర అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు తహతహలాడారు. దీంతో.. రూ.7వేలు ఉండాల్సిన ఫ్లైట్ టికెట్ ఏకంగా రూ.40వేలకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దుబాయ్ లో వైద్య సేవలకు వెళ్లే వారు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి వారిలో ఐదారుగురు కలిసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లటం.. అక్కడి నుంచి తిరిగి రావటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 25, 2021 10:01 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…