హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి.
తాజాగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో భారత విమానాలపై దుబాయ్ నిషేధాన్ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ బ్యాన్ అమలు కానుంది. దీంతో.. శనివారం వరకు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. ఏడాదిగా నడుస్తున్న కరోనా రచ్చతో దుబాయ్ లో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.
కేసుల తీవ్రత తగ్గినప్పటి నుంచి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. అది.. ఈ మధ్యన మరింత పెరిగాయి. అంతలోనే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటంతో.. కాస్త జోరు తగ్గిన తర్వాత దుబాయ్ కు వెళదామని భావించారు. కానీ.. దుబాయ్ సర్కారు భారత్ నుంచి వచ్చే వారి విషయంలో తీవ్ర ఆంక్షల్ని విధించింది. భారత్ నుంచి వచ్చిన వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆదివారం నుంచి భారత్ నుంచి దుబాయ్ కు ఫ్లైట్లను అనుమతించకూడదని నిర్ణయించింది.
దీంతో.. సెలవుల మీద దేశానికి వచ్చిన వారిలో కొత్త గుబులు మొదలైంది. ప్రస్తుతానికి పది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించిన దుబాయ్.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. నిషేధం మరింతకాలం కొనసాగించే వీలుందన్న సందేహాలు ఎక్కువ అయ్యాయి. అంతకాలం ఇండియాలోనే ఉండిపోతే.. ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో.. ఎవరికి వారు ఎంత ధర అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు తహతహలాడారు. దీంతో.. రూ.7వేలు ఉండాల్సిన ఫ్లైట్ టికెట్ ఏకంగా రూ.40వేలకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దుబాయ్ లో వైద్య సేవలకు వెళ్లే వారు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి వారిలో ఐదారుగురు కలిసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లటం.. అక్కడి నుంచి తిరిగి రావటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 25, 2021 10:01 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…