హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి.
తాజాగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో భారత విమానాలపై దుబాయ్ నిషేధాన్ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ బ్యాన్ అమలు కానుంది. దీంతో.. శనివారం వరకు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. ఏడాదిగా నడుస్తున్న కరోనా రచ్చతో దుబాయ్ లో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.
కేసుల తీవ్రత తగ్గినప్పటి నుంచి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. అది.. ఈ మధ్యన మరింత పెరిగాయి. అంతలోనే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటంతో.. కాస్త జోరు తగ్గిన తర్వాత దుబాయ్ కు వెళదామని భావించారు. కానీ.. దుబాయ్ సర్కారు భారత్ నుంచి వచ్చే వారి విషయంలో తీవ్ర ఆంక్షల్ని విధించింది. భారత్ నుంచి వచ్చిన వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆదివారం నుంచి భారత్ నుంచి దుబాయ్ కు ఫ్లైట్లను అనుమతించకూడదని నిర్ణయించింది.
దీంతో.. సెలవుల మీద దేశానికి వచ్చిన వారిలో కొత్త గుబులు మొదలైంది. ప్రస్తుతానికి పది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించిన దుబాయ్.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. నిషేధం మరింతకాలం కొనసాగించే వీలుందన్న సందేహాలు ఎక్కువ అయ్యాయి. అంతకాలం ఇండియాలోనే ఉండిపోతే.. ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో.. ఎవరికి వారు ఎంత ధర అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు తహతహలాడారు. దీంతో.. రూ.7వేలు ఉండాల్సిన ఫ్లైట్ టికెట్ ఏకంగా రూ.40వేలకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దుబాయ్ లో వైద్య సేవలకు వెళ్లే వారు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి వారిలో ఐదారుగురు కలిసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లటం.. అక్కడి నుంచి తిరిగి రావటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 25, 2021 10:01 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…