ఎన్నికలు చివరిదశకు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పెద్ద షాకే ఇచ్చాడు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గెలుపుకోసం ఒకసారి అంటే మొన్నటి 3వ తేదీన తిరుపతిలో రోడ్డుషో నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేరు. ఒకవైపు బీజేపీయేమో ఓట్లకోసం అచ్చంగా పవన్ పైనే ఆధారపడింది. ఈ దశలో కమలనాదులకు పవన్ గట్టి షాకిచ్చాడు. పవన్ను అభ్యర్ధి రత్నప్రభ తమ్ముడు అని సంబోదిస్తుంటుంది. అందుకనే అక్కడ తమ్ముడు షాకిచ్చినట్లుగానే కమలనాదులు చెప్పుకుంటున్నారు.
12వ తేదీ అంటే సోమవారం బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా తిరుపతిలో ప్రచారానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. పవన్ సన్నిహితులు, వ్యక్తిగత సిబ్బందిలో చాలామందికి కరోనా వైరస్ సోకిందట. దాంతో ఎవరికి వాళ్ళుగా డ్యూటీల నుండి పక్కకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇన్నిరోజులు పవన్ కు సమీపంగానే మెలిగిన అంతమంది సిబ్బందికి కరోనా వైరస్ సోకిన తర్వాత పవన్ కు రాకుండా ఉంటుందా అనేది సందేహం.
నిజానికి పవన్ కరోనా వైరస్ టెస్టు చేయించుకున్నారా ? కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయంలో ఎవరికీ సరైన సమాచారంలేదు. అయితే గడచిన మూడు రోజుల క్రితంనుండి పవన్ తనంతట తానుగా హోం క్వారంటైన్ పాటిస్తున్నట్లు చెప్పారట. దాంతో జనసేనానికి కరోనా వైరస్ సోకుంటుందని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్లో కూడా కనబడలేదు. పోలింగ్ మరో మూడు రోజుల్లో ముగిసేముందు సరిగ్గా పవన్ హోం క్వారంటైన్ లోకి వెళిపోవటం బీజేపీకి గట్టి షాకనే చెప్పాలి.
This post was last modified on April 12, 2021 10:51 am
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…