Political News

అక్కకి పెద్ద షాకిచ్చిన పవన్

ఎన్నికలు చివరిదశకు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పెద్ద షాకే ఇచ్చాడు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గెలుపుకోసం ఒకసారి అంటే మొన్నటి 3వ తేదీన తిరుపతిలో రోడ్డుషో నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేరు. ఒకవైపు బీజేపీయేమో ఓట్లకోసం అచ్చంగా పవన్ పైనే ఆధారపడింది. ఈ దశలో కమలనాదులకు పవన్ గట్టి షాకిచ్చాడు. పవన్ను అభ్యర్ధి రత్నప్రభ తమ్ముడు అని సంబోదిస్తుంటుంది. అందుకనే అక్కడ తమ్ముడు షాకిచ్చినట్లుగానే కమలనాదులు చెప్పుకుంటున్నారు.

12వ తేదీ అంటే సోమవారం బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా తిరుపతిలో ప్రచారానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. పవన్ సన్నిహితులు, వ్యక్తిగత సిబ్బందిలో చాలామందికి కరోనా వైరస్ సోకిందట. దాంతో ఎవరికి వాళ్ళుగా డ్యూటీల నుండి పక్కకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇన్నిరోజులు పవన్ కు సమీపంగానే మెలిగిన అంతమంది సిబ్బందికి కరోనా వైరస్ సోకిన తర్వాత పవన్ కు రాకుండా ఉంటుందా అనేది సందేహం.

నిజానికి పవన్ కరోనా వైరస్ టెస్టు చేయించుకున్నారా ? కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయంలో ఎవరికీ సరైన సమాచారంలేదు. అయితే గడచిన మూడు రోజుల క్రితంనుండి పవన్ తనంతట తానుగా హోం క్వారంటైన్ పాటిస్తున్నట్లు చెప్పారట. దాంతో జనసేనానికి కరోనా వైరస్ సోకుంటుందని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్లో కూడా కనబడలేదు. పోలింగ్ మరో మూడు రోజుల్లో ముగిసేముందు సరిగ్గా పవన్ హోం క్వారంటైన్ లోకి వెళిపోవటం బీజేపీకి గట్టి షాకనే చెప్పాలి.

This post was last modified on April 12, 2021 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

22 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago