Political News

తిరుపతి ఉప పోరులో ‘గ్లాసు’ గుర్తు.. అదెలా సాధ్యం?

ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచేలా మారిన తిరుపతి ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ బరిలో నిలవటం.. ఆమె తరఫున జనసేన అధినేత పవన్ భారీగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్. దీంతో అధికార పార్టీ వర్సెస్ పవన్ అన్నట్లుగా పోరు నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన అభ్యర్థులకు కేటాయించే గ్లాసు గుర్తును.. తాజా ఉప పోరులో నవతరం పార్టీకి చెందిన అభ్యర్థికి ఎన్నికల అధికారులు కేటాయించారు. ఎందుకిలా? అంటే.. ఇప్పటివరకు జనసేనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా లేదు. అలాంటివేళలో.. అలాంటి పార్టీల గుర్తు.. మరే ఇతర అభ్యర్థులకైనా కేటాయించే వీలుంది.

తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. జనసేన అభ్యర్థి బరిలో లేకపోవటంతో.. ఎన్నికల అధికారులు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. అయితే.. ఇదంతా వైసీపీ చేసిన రాజకీయ కుట్రగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఎన్నికల సంఘం అధికారులు కొట్టి పారేస్తున్నారు. నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్నే అభ్యర్థులకు కేటాయించామని చెబుతున్నారు.

నిజమే.. రూల్ పొజిషన్ ప్రకారం గ్లాసు గుర్తు కేటాయించి ఉండి ఉండొచ్చు.కానీ.. జనసేన పార్టీ ఒకటి ఉందని.. దానికి గ్లాసు గుర్తు అల్రెడీ కేటాయిస్తుంటారన్న విషయం తెలియని అధికారి ఎవరూ ఉండరు. అయినా.. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తులు బోలెడన్ని ఉండగా.. గ్లాసు గుర్తునే ఎన్నికల అధికారులు కేటాయించటంలో మతలబు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కోరి వివాదాల్ని నెత్తిన వేసుకున్నట్లుగా అధికారుల తీరు ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా.. గ్లాసు గుర్తు బరిలోకి వచ్చేయటం.. బీజేపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది.

This post was last modified on April 5, 2021 10:32 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

2 hours ago

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

3 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

4 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

4 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

5 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

6 hours ago