పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో పడి భర్తల్ని భార్యలు చంపించే కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
అయితే.. అలాంటి ఉదంతాలన్నింటిలోనూ హత్యలకు కారణమైన వారు పోలీసులకు చిక్కటం..జైల్లో ఊచలు లెక్కించటం చూస్తున్నాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రేకుర్తి గ్రామంలో రాజయ్య మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పని చేసేవాడు. అతని భార్య లత తాపీ పనికి వెళ్లేది. ఈ క్రమంలోతాపీ మేస్త్రీ బాబుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్నిగుర్తించిన రాజయ్య భార్యను హెచ్చరించేవాడు.
ప్రియుడ్ని వదులుకోని భార్య.. భర్తను చంపేయించాలని ప్లాన్ చేసింది. బాబుకు విషయం చెప్పి తన భర్త అడ్డు తొలగించాలని కోరింది. ఫ్రిబవరి ఐదున విందు ఉందని ఆటో తీసుకొచ్చిన బాబు.. రాజయ్యను ఎక్కించుకొని వెళ్లాడు. తమ సొంతగ్రాంలో పుల్లుగా కల్లు తాగించి.. మత్తులో ఉన్న వేళ.. అదును చూసి మెడ మీద కొట్టి.. అనంతరం ఎస్సారెస్పీకెనాల్ లోకి తోసేశాడు. రాజయ్య చనిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం.. భర్త కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే రాజయ్య డెడ్ బాడీ దాదాపు 150కి.మీ. దూరానికి కొట్టుకుపోయి.. మహబూబ్ నగర్ జిల్లా కురవి వద్ద పోలీసులకు దొరికింది. విషయం తెలిసి లతను.. ఆమె కొడుకును.. బంధువుల్ని తీసుకొని అక్కడకు వెళ్లారు. అప్పటికే ఆమె ఫోన్ కాల్స్ మీద కన్నేసిన పోలీసులు.. ఆమెను అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో..ఆమెను.. హత్య చేసిన బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
This post was last modified on February 27, 2021 10:51 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…