పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో పడి భర్తల్ని భార్యలు చంపించే కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
అయితే.. అలాంటి ఉదంతాలన్నింటిలోనూ హత్యలకు కారణమైన వారు పోలీసులకు చిక్కటం..జైల్లో ఊచలు లెక్కించటం చూస్తున్నాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రేకుర్తి గ్రామంలో రాజయ్య మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పని చేసేవాడు. అతని భార్య లత తాపీ పనికి వెళ్లేది. ఈ క్రమంలోతాపీ మేస్త్రీ బాబుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్నిగుర్తించిన రాజయ్య భార్యను హెచ్చరించేవాడు.
ప్రియుడ్ని వదులుకోని భార్య.. భర్తను చంపేయించాలని ప్లాన్ చేసింది. బాబుకు విషయం చెప్పి తన భర్త అడ్డు తొలగించాలని కోరింది. ఫ్రిబవరి ఐదున విందు ఉందని ఆటో తీసుకొచ్చిన బాబు.. రాజయ్యను ఎక్కించుకొని వెళ్లాడు. తమ సొంతగ్రాంలో పుల్లుగా కల్లు తాగించి.. మత్తులో ఉన్న వేళ.. అదును చూసి మెడ మీద కొట్టి.. అనంతరం ఎస్సారెస్పీకెనాల్ లోకి తోసేశాడు. రాజయ్య చనిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం.. భర్త కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే రాజయ్య డెడ్ బాడీ దాదాపు 150కి.మీ. దూరానికి కొట్టుకుపోయి.. మహబూబ్ నగర్ జిల్లా కురవి వద్ద పోలీసులకు దొరికింది. విషయం తెలిసి లతను.. ఆమె కొడుకును.. బంధువుల్ని తీసుకొని అక్కడకు వెళ్లారు. అప్పటికే ఆమె ఫోన్ కాల్స్ మీద కన్నేసిన పోలీసులు.. ఆమెను అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో..ఆమెను.. హత్య చేసిన బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
This post was last modified on February 27, 2021 10:51 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…