బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సీక్వెల్ వచ్చే వారం విడుదలవుతున్న సందర్భంగా మొదటి భాగాన్ని వెయ్యికి పైగా స్క్రీన్లలో మళ్ళీ విడుదల చేశారు. కేవలం వంద రోజుల గ్యాప్ లోనే వచ్చేయడంతో ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ దురంధర్ గత ఇరవై నాలుగు గంటల్లో అయిదు వేలకు పైగా టికెట్లు అమ్మడం గమనార్హం. ఇది చాలా అరుదుగా చూసే ఫీట్.
ఇక దురంధర్ ది రివెంజ్ సంగతి తెలిసిందే. రోజుకు నలభై వేలకు తగ్గకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ బుకింగ్స్, డిస్ట్రిక్ట్ యాప్ సేల్స్ ఇందులో యాడ్ కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ పోటీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ దురంధర్ రివెంజ్ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. దాన్ని చూడడానికి ముందు మరోసారి ఫస్ట్ పార్ట్ చూడాలన్న ఉద్దేశంతో నిర్మాతలు వేసిన ఎత్తుగడ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ముఖ్యంగా నగరాల్లో దీనికి రెస్పాన్స్ బాగుంది.
రిలీజ్ ఇంకా అయిదు రోజుల దూరంలో ఉండగానే దురంధర్ రివెంజ్ ఇన్నేసి ఫీట్లు సాధించడం మాములు విషయం కాదు. కేవలం ప్రీమియర్లతోనే నలభై కోట్లకు పైగా రాబట్టిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి షో పడేనాటికి ఎవరూ టచ్ చేయలేని రికార్డు అందుకోవడం ఖాయంగా ఉంది. టీమ్ ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొనమ్మన్న కొందరి అభ్యర్థనకి దర్శకుడు ఆదిత్య ధార్ సున్నితంగా నో చెప్పారట.
మొదటి రోజు ఎంత కలెక్షన్ నమోదవుతుందనేది ఎవరి ఊహకు అందటం లేదు. మార్చి 19 నుంచే నడిచే షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ నుంచి ప్రారంభించారు. నాలుగు గంటల నిడివి ఉందని తెలిసి కూడా టాక్, రివ్యూస్ చూసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున దురంధర్ రివెంజ్ మీద జనం ఆసక్తి చూపించడం విశేషమే. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్న ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కావడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయితే ఈసారి టార్గెట్ ఖచ్చితంగా రెండు వేల కోట్లే.
This post was last modified on March 14, 2026 4:15 pm
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…
‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…