బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సీక్వెల్ వచ్చే వారం విడుదలవుతున్న సందర్భంగా మొదటి భాగాన్ని వెయ్యికి పైగా స్క్రీన్లలో మళ్ళీ విడుదల చేశారు. కేవలం వంద రోజుల గ్యాప్ లోనే వచ్చేయడంతో ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ దురంధర్ గత ఇరవై నాలుగు గంటల్లో అయిదు వేలకు పైగా టికెట్లు అమ్మడం గమనార్హం. ఇది చాలా అరుదుగా చూసే ఫీట్.
ఇక దురంధర్ ది రివెంజ్ సంగతి తెలిసిందే. రోజుకు నలభై వేలకు తగ్గకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ బుకింగ్స్, డిస్ట్రిక్ట్ యాప్ సేల్స్ ఇందులో యాడ్ కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ పోటీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ దురంధర్ రివెంజ్ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. దాన్ని చూడడానికి ముందు మరోసారి ఫస్ట్ పార్ట్ చూడాలన్న ఉద్దేశంతో నిర్మాతలు వేసిన ఎత్తుగడ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ముఖ్యంగా నగరాల్లో దీనికి రెస్పాన్స్ బాగుంది.
రిలీజ్ ఇంకా అయిదు రోజుల దూరంలో ఉండగానే దురంధర్ రివెంజ్ ఇన్నేసి ఫీట్లు సాధించడం మాములు విషయం కాదు. కేవలం ప్రీమియర్లతోనే నలభై కోట్లకు పైగా రాబట్టిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి షో పడేనాటికి ఎవరూ టచ్ చేయలేని రికార్డు అందుకోవడం ఖాయంగా ఉంది. టీమ్ ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొనమ్మన్న కొందరి అభ్యర్థనకి దర్శకుడు ఆదిత్య ధార్ సున్నితంగా నో చెప్పారట.
మొదటి రోజు ఎంత కలెక్షన్ నమోదవుతుందనేది ఎవరి ఊహకు అందటం లేదు. మార్చి 19 నుంచే నడిచే షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ నుంచి ప్రారంభించారు. నాలుగు గంటల నిడివి ఉందని తెలిసి కూడా టాక్, రివ్యూస్ చూసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున దురంధర్ రివెంజ్ మీద జనం ఆసక్తి చూపించడం విశేషమే. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్న ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కావడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయితే ఈసారి టార్గెట్ ఖచ్చితంగా రెండు వేల కోట్లే.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…