బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సీక్వెల్ వచ్చే వారం విడుదలవుతున్న సందర్భంగా మొదటి భాగాన్ని వెయ్యికి పైగా స్క్రీన్లలో మళ్ళీ విడుదల చేశారు. కేవలం వంద రోజుల గ్యాప్ లోనే వచ్చేయడంతో ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ దురంధర్ గత ఇరవై నాలుగు గంటల్లో అయిదు వేలకు పైగా టికెట్లు అమ్మడం గమనార్హం. ఇది చాలా అరుదుగా చూసే ఫీట్.
ఇక దురంధర్ ది రివెంజ్ సంగతి తెలిసిందే. రోజుకు నలభై వేలకు తగ్గకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ బుకింగ్స్, డిస్ట్రిక్ట్ యాప్ సేల్స్ ఇందులో యాడ్ కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ పోటీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ దురంధర్ రివెంజ్ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. దాన్ని చూడడానికి ముందు మరోసారి ఫస్ట్ పార్ట్ చూడాలన్న ఉద్దేశంతో నిర్మాతలు వేసిన ఎత్తుగడ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ముఖ్యంగా నగరాల్లో దీనికి రెస్పాన్స్ బాగుంది.
రిలీజ్ ఇంకా అయిదు రోజుల దూరంలో ఉండగానే దురంధర్ రివెంజ్ ఇన్నేసి ఫీట్లు సాధించడం మాములు విషయం కాదు. కేవలం ప్రీమియర్లతోనే నలభై కోట్లకు పైగా రాబట్టిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి షో పడేనాటికి ఎవరూ టచ్ చేయలేని రికార్డు అందుకోవడం ఖాయంగా ఉంది. టీమ్ ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొనమ్మన్న కొందరి అభ్యర్థనకి దర్శకుడు ఆదిత్య ధార్ సున్నితంగా నో చెప్పారట.
మొదటి రోజు ఎంత కలెక్షన్ నమోదవుతుందనేది ఎవరి ఊహకు అందటం లేదు. మార్చి 19 నుంచే నడిచే షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ నుంచి ప్రారంభించారు. నాలుగు గంటల నిడివి ఉందని తెలిసి కూడా టాక్, రివ్యూస్ చూసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున దురంధర్ రివెంజ్ మీద జనం ఆసక్తి చూపించడం విశేషమే. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్న ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కావడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయితే ఈసారి టార్గెట్ ఖచ్చితంగా రెండు వేల కోట్లే.
This post was last modified on March 14, 2026 4:15 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…