నియోజకవర్గాలకు నాయకులను ఎంపిక చేస్తున్న జగన్పై అదే నాయకుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఒత్తిడితోనే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా ? లేక.. పార్టీ కోణంలో తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కొందరు నాయకులను నియోజకవర్గాలకు ఇంచార్జ్లుగా నియమించారు. వీరే పార్టీని ముందుకు నడిపించాలని కూడా తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి.. అంటే మూడేళ్లపాటు పార్టీని నడిపించినా.. చివరకు టికెట్ విషయంలో పేచీ పెడితే.. తమ పరిస్థితి ఏంటన్నది నాయకుల మధ్య జరుగుతున్న చర్చ. గతంలో ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించిన రాజశేఖర్కు చివరి నిమిషంలో టికెట్ లేకుండా చేశారు. చీరాలలో పార్టీకి సహకరించిన ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి కూడా అలానే ఉంది.
ఈ రెండు చోట్లే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే మారింది. దీంతో అప్పట్లో నాయకులు పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో రగిలిపోయారు. కానీ, ఆల్టర్నేట్ లేకపోవడంతో సర్దుకున్నారు. కానీ, ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీలు ఉన్నాయి. అవి కూడా నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకునే ప్రతి స్టెప్లోనూ జాగ్రత్తలు పాటించాలన్నది సీనియర్లు చెబుతున్న మాట. నియోజకవర్గం బాధ్యతలు ఇస్తే.. ఆయనకే టికెట్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు.
ఉదాహరణకు .. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ సీఎం జనార్దన్రెడ్డికుమారుడు రాంకుమార్రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. కానీ, ఎన్నికల వరకు ఈయనను కొనసాగిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గుంటూరు బాధ్యతలను పోతిన మహేష్కు ఇచ్చారు. ఈయన పరిస్థితి కూడా ఇలానే ఉంది.
సో.. దీంతో వీరు నియోజకవర్గాల్లో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పార్టీ తమకు బలమైన భరోసా ఇస్తే తప్ప.. రూపాయి ఖర్చు విషయంలో కానీ.. పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ.. దూకుడు చూపించలేమని అంతర్గతంగా చెబుతున్నారు. ఈ విషయంపైనా జగన్ దృష్టి పెట్టాల్సి ఉంది.
This post was last modified on March 14, 2026 4:25 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…