అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ జీవితాలకు దగ్గరగా కథలు రాసుకునేవాళ్లను ఈ బ్యాచ్ లోకి చేర్చవచ్చు. ముఖ్యంగా మలయాళంలో వీళ్ళు కొన్నిసార్లు చేస్తున్న వండర్లు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి. రాజా సాబ్ వైఫల్యంతో అభిమానులను బాగా నిరాశకు గురి చేసిన ప్రభాస్ ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ వైపు దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఎకో – కిష్కిందకాండం లాంటి మూవీస్ తో విమర్శకులను మెప్పించి బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన దర్శకుడు దింజిత్ ఇటీవలే ప్రభాస్ ని కలుసుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ తిరిగింది. ఒక లైన్ ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని, కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ – సాయిపల్లవి – మమ్ముట్టి కాంబోలో సినిమా తీస్తున్న రాజ్ కుమార్ పెరియస్వామి సైతం ప్రభాస్ ని కలిసినవాళ్లలో ఉన్నాడట. ఇతని గత చిత్రం అమరన్ గురించి తెలిసిందే.
ఈ ఇద్దరికీ ఎక్కువ అనుభవం లేదు. అయినా సరే కంటెంట్ తో హిట్లు కొడుతున్నారు. ప్రభాస్ ఇలాంటివాళ్లతో పని చేయడం చాలా అవసరం. మారుతీ, హను రాఘవపూడి లాంటి సీనియర్లతో పాటు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళతో చేతులు కలపడం వల్ల మంచి ఫలితాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సమాంతరంగా జరిగేలా చూసుకుంటున్న ప్రభాస్ ఆ తర్వాత సలార్ 2 మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈలోగా మరో రెండు ప్రాజెక్టులు లాక్ చేసుకుంటే గ్యాప్ రాకుండా ఉంటుంది. ఆ దిశగా ప్రభాస్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫౌజీ విడుదలైపోతుంది. వచ్చే మార్చిలో స్పిరిట్ వచ్చేస్తుంది. సో కల్కి 2, సలార్ 2లకు ఎక్కువ డేట్లు ఇవ్వొచ్చు. ఒకవేళ దింజిత్, రాజ్ కుమార్ లలో ఒకరికి ఛాన్స్ ఇస్తే మటుకు ఊహించని ఒక ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది.
This post was last modified on March 14, 2026 4:21 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…