అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ కన్నా ఎక్కువ. ఓజి లాగా రికార్డులు బద్దలు కొట్టినా, హరిహర వీరమల్లు లాగా కంటెంట్ నిరాశపరిచినా వాళ్ళ ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మీద బయ్యర్లకు అంత నమ్మకం. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ కావడం, దర్శకుడు హరీష్ శంకర్ పంచుకుంటున్న సంగతులు మెల్లగా అంచనాలు పెంచుకుంటూ పోయాయి. అందుకే అందరి కళ్ళు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ట్రైలర్ మీద ఉన్నాయి
రెండు నిమిషాల వీడియో రూపంలో ఆ లాంఛనం జరిగిపోయింది. ఎవరికీ భయపడని పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్). స్థానిక రాజకీయ నాయకుడు (పార్తీబన్) బెదిరించాలని చూసినా తలొగ్గని రకం. అలాంటి వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి (శ్రీలీల) వస్తుంది. డాన్స్ అన్నా, సరదాగా ఉండటమన్న ఆమడ దూరంలో ఉండే భగత్ కు అతి పెద్ద సవాల్ రౌడీయిజం రూపంలో తగులుతుంది. అసలైన వయొలెన్స్ అంటే ఏంటో శత్రువులకు చూపిస్తాడు. అదేంటో మార్చి 19 తేలనుంది.
చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పవన్ స్వాగ్ ఇందులో బయట పడింది. తన మీద తనే జోకులు వేసుకోవడం, చిరంజీవి ఠాగూర్ డైలాగుని తన మీద సెటైర్ కు వాడుకోవడం, ప్రాసల గురించి పంచ్ వేయడం వగైరాలన్నీ హరీష్ శంకర్ స్టైల్ లో సాగాయి. అలాని యాక్షన్ ఎలిమెంట్స్ దూరంగా పెట్టలేదు. కత్తులు, కటార్లు, గన్లు, రక్తపాతాలు, భీభత్సమైన ఫైట్లు అన్నీ ఉన్నాయి. గోత్రం, నక్షత్రం పేరుతో చివర్లో చెప్పిన డైలాగు మాస్ విజిల్స్ కోసమని చెప్పనక్కర్లేదు.
అంచనాలు పెంచడంలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ సక్సెస్ అయ్యింది. అసలు కంటెంట్ కూడా ఇదే స్థాయిలో ఉంటే కనక కలెక్షన్లు నల్లేరు మీద నడక లాగా వచ్చేస్తాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మంచి ఎలివేషన్ కు ఉపయోగపడినా కొంచం రిసౌండ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. శ్రీలీల, రాశి ఖన్నాని రివీల్ చేశారు. విలన్ ని కేవలం ఒక్క ఫ్రేమ్ కే పరిమితం చేయడం హరీష్ శంకర్ వ్యూహంలో భాగం కావొచ్చు. ఓజి తర్వాత తక్కువ గ్యాప్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తున్న పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ ర్యాంపేజ్ చేస్తారో ఇంకో అయిదు రోజుల్లో తేలనుంది.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…