ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నారా, నందమూరి కుటుంబాలు నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాయి. ఈ నెల 21వ తేదీకి నారా దేవాన్ష్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది.
“తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ.. మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది” అని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్ ను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.
ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సహా పలువురు పాల్గొన్నారు. 2015 మార్చి 21న దేవాన్ష్ జన్మించాడు. ప్రస్తుతం విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న ఆయన ప్రపంచ చెస్ లో పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ వేడుకలతో పాటు శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ వేడుకలు కూడా జరగడం విశేషం.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…