ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నారా, నందమూరి కుటుంబాలు నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాయి. ఈ నెల 21వ తేదీకి నారా దేవాన్ష్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది.
“తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ.. మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది” అని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్ ను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.
ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సహా పలువురు పాల్గొన్నారు. 2015 మార్చి 21న దేవాన్ష్ జన్మించాడు. ప్రస్తుతం విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న ఆయన ప్రపంచ చెస్ లో పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ వేడుకలతో పాటు శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ వేడుకలు కూడా జరగడం విశేషం.
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…