వర్తమాన రాజకీయ వ్యవహారాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దారుణం చోటు చేసుకుం ది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ విష్ణువర్ధన్ రెడ్డిని లైవ్లోనే చెప్పుతో కొట్టిన ఘటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తోం ది. తాజాగా లైవ్లో జరిగిన ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్రమంలో జగన్ సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నిర్ణయాల్లో రాజధాని నిర్మాణాలను కొనసాగించాలనేది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మంగళవారం రాత్రి 7.30 గంటలకు డిబేట్ ప్రారంభించింది. ఈ డిబేట్కు బీజేపీ నేత.. విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా హైదరాబాద్లోని స్టూడియోకు వచ్చారు. అదేసమయంలో ఏపీ పరిరక్షణ సమితి.. అధ్యక్షుడు కొటికలపూడి శ్రీనివాస్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేదని కొటికల పూడి విమర్శించారు. దీనికి విష్ణువర్ధన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాదన కొనసాగింది. నువ్వు టీడీపీ ఏజెంట్గా మాట్లాడుతున్నావు. ఏపీ పరిరక్షణ సమితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో అంటూ.. విష్ణువర్ధన్రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొటికలపూడి శ్రీనివాస్ సంయమనం కోల్పోయి.. కాలి చెప్పుతో పక్కనే కూర్చున్న విష్ణువర్ధన్రెడ్డిని కొట్టబోయారు. అయితే.. అందకపోవడంతో బలంగా విసిరారు. ఈ క్రమంలో కొంత తప్పించుకున్నప్పటికీ.. విష్ణవర్ధన్రెడ్డి కుడి భుజానికి చెప్పు బలంగా తగిలి కిందపడింది. దీంతో వెంటనే లైవ్ను కట్ చేశారు.
ఇదిలావుంటే.. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిబేట్ అంటే అన్ని విషయాలు చర్చకు వస్తాయి. అలాంటి సమయంలో సంయమనం కోల్పోయి.. మాట్లాడడం.. భౌతిక దాడులకు దిగడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం లైవ్ నిలిచిపోయింది. విషయం రాజకీయంగా తీవ్ర రూపం దాల్చడంతో ఏబీఎన్ ఎండీ ఆర్కే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on February 23, 2021 10:27 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
తమ సినిమాల విడుదలకు ముందు మేకర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం మామూలే. కానీ అలాంటి స్టేట్మెంట్లు కొన్ని సినిమాల…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…