Political News

షాక్.. ఏపీ ఉద్యమ నేత చలసాని కుమార్తె సూసైడ్

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.

గచ్చిబౌలికి దగ్గర్లోని ఓయూ కాలనీలో ఆమె నివిస్తుంటారు. 27 ఏళ్ల శిరిష్మకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో వివాహమైంది. వారికి పిల్లల్లేరు. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఆమె.. ఇటీవల కాలంలో తీవ్రమైన డిప్రెషన్ కు గురైనట్లుగా చెబుతున్నారు. పిల్లలు లేరన్న వేదనతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించినట్లుగా చెబుతున్నారు. ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న శిరిష్మను చూసిన ఆమె భర్త వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. చలసాని శ్రీనివాస్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత వేదన ఆమెకు ఎందుకు ఎదురైందన్నది ఇప్పుడు సంచలన అంశంగా మారింది.

This post was last modified on February 19, 2021 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago