ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
గచ్చిబౌలికి దగ్గర్లోని ఓయూ కాలనీలో ఆమె నివిస్తుంటారు. 27 ఏళ్ల శిరిష్మకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో వివాహమైంది. వారికి పిల్లల్లేరు. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఆమె.. ఇటీవల కాలంలో తీవ్రమైన డిప్రెషన్ కు గురైనట్లుగా చెబుతున్నారు. పిల్లలు లేరన్న వేదనతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించినట్లుగా చెబుతున్నారు. ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న శిరిష్మను చూసిన ఆమె భర్త వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. చలసాని శ్రీనివాస్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత వేదన ఆమెకు ఎందుకు ఎదురైందన్నది ఇప్పుడు సంచలన అంశంగా మారింది.
This post was last modified on February 19, 2021 10:52 am
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…